PM Modi : గుజరాత్ లో ప్రతిష్టాత్మక ” ఇన్ – స్పేస్ ఈ” .. ప్రారంభించిన మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ లో శుక్రవారం రూ.3050 కోట్లు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
- By Hashtag U Published Date - 03:03 PM, Fri - 10 June 22

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ లో శుక్రవారం రూ.3050 కోట్లు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో అత్యంత కీలకమైనది అహ్మదాబాద్ లోని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్ – స్పేస్ ఈ). అంతరిక్ష విజ్ఞాన రంగంలో ప్రయివేట్ రంగానికి ప్రోత్సహించే ప్రధాన కేంద్రంగా “ఇన్ – స్పేస్ ఈ ” సేవలు అందించనుంది. స్పేస్ లాంచ్ వెహికిల్స్ అభివృద్ధి, శాటిలైట్ల తయారీ చేపట్టే ప్రైవేటు రంగ అంతరిక్ష కంపెనీలకు అనుమతులు ఇచ్చే సింగిల్ విండోగా “ఇన్ – స్పేస్ ఈ ” వ్యవహరించనుంది.
మనవరాలి పేరిట L & T అధినేత నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రి..
L & T వ్యాపార గ్రూప్ అధినేత ఏ.ఎం.నాయక్ గురించి తెలియని వారుండరు. ఆయన మనవరాలు
నిరాళి రెండేళ్ల వయసులోనే క్యాన్సర్ తో కన్నుమూసింది. ఆమె స్మారకార్ధం గుజరాత్ లోని ” నవ్సారి ” జిల్లాలో ఏ.ఎం.నాయక్ నిర్మించిన నిరాళి క్యాన్సర్ ఆస్పత్రిని మోడీ ప్రారంభించారు. ఏ.ఎం.నాయక్ హెల్త్ కేర్ కాంప్లెక్స్ ను కూడా ప్రారంభించారు. కాగా, గుజరాత్ గౌరవ్ అభియాన్ లోని భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ మొదలుపెట్టారు.
Related News

LPG Price Hike : గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం విమర్శించారు. గ్యాస్ సిలిండర్ల ధరలను యూనిట్కు రూ.50 పెంచినందున వాటి ధర బుధవారం నుంచి పెరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు యూనిట్ ధర రూ.1,053 అవుతుంది. కోల్కతా, ముంబై, చెన్నైలలో వరుసగా రూ.1,079, రూ.1,052.5, రూ.1,068.5గా ఉంటుందని ఇండియన్ ఆ