HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pla Chinese Compelled To Return

Rajnath Singh : చైనా సైన్యాన్ని త‌రిమేసిన భార‌త ఆర్మీ: పార్ల‌మెంట్లో రాజ్ నాథ్

చైనా సైన్యంలోని (PLA) ని భార‌త సైన్యం త‌రిమికొట్టింది. ఆ మేర‌కు మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh)పార్ల‌మెంట్ లో ప్ర‌క‌ట‌న చేశారు.

  • Author : CS Rao Date : 13-12-2022 - 1:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajnath Singh
Rajnath Prliament

చైనా సైన్యంలోని `పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ`(PLA) ని భార‌త సైన్యం త‌రిమికొట్టింది. భార‌త సైన్యం విరోచిపోరాటం కార‌ణంగా చైనా సైన్యం తోక‌ముడిచింది. వాస్త‌వాధీన రేఖ‌ను మార్చేయాల‌ని పీఎల్ ఏ (PLA)చేసిన ప్ర‌య‌త్నం చేసింది. క్ష‌ణాల్లో అప్ర‌మ‌త్త‌మైన భార‌త సైన్యం పీఎల్ ఏ ప్ర‌య‌త్నాన్ని తిప్పికొట్టింది. ఆ సంద‌ర్భంగా ఇరు దేశాల సైన్యాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నెల‌కొంది. భార‌త సైన్యానికి ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేదు. భార‌త సైనికులు ఎవ‌రూ చనిపోలేదు. తీవ్రంగా ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదు. చాక‌చ‌క్యంగా పీఎల్ ఏను తిరిగి వాళ్ల స్థానాల‌కు పంపించ‌డంలో భార‌త సైన్యం విజ‌యం సాధించింది. ఆ మేర‌కు భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh)పార్ల‌మెంట్ లో ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

భారత్, చైనా సైనికుల మధ్య అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దుల్లోని త‌వాంగ్ వ‌ద్ద జ‌రిగిన తాజా ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) మంగ‌ళ‌వారం పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ ఘర్షణలో భారత సైనికులెవరూ చనిపోలేదని, తీవ్రంగా గాయపడలేదని ఆయన తెలిపారు. “9 డిసెంబర్ 2022న, PLA (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా) దళాలు తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో LACని అతిక్రమించి, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించాయి. చైనా ప్రయత్నాన్ని మా దళాలు దృఢంగా మరియు దృఢంగా ఎదుర్కొన్నాయి.` అంటూ రాజ్ నాథ్ ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత `ముఖాముఖి భౌతిక ఘర్షణకు దారితీసింది, దీనిలో భారత సైన్యం PLAని మన భూభాగంలోకి అతిక్రమించకుండా ధైర్యంగా నిరోధించింది . వారి స్థానాలకు తిరిగి వెళ్లేలా వారిని బలవంతం చేసింది` అంటూ వివ‌రించారు.

“కొట్లాట రెండు వైపులా కొంతమంది సిబ్బందికి గాయాలయ్యాయి. మా వైపు ఎటువంటి ప్రాణనష్టం లేదా తీవ్రమైన ప్రాణనష్టం జరగలేదని నేను ఈ సభతో పంచుకోవాలనుకుంటున్నాను.` అంటూ రాజ్ నాథ్ వెల్ల‌డించారు. “భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం కారణంగా, PLA సైనికులు వారి స్థానాలకు తిరిగి వెళ్లారు. చైనా పక్షం అటువంటి చర్యలకు దూరంగా ఉండాలని , సరిహద్దు వెంబడి శాంతి, ప్రశాంతతను కాపాడాలని కోరాం. ఈ సమస్యను దౌత్య మార్గాల ద్వారా చైనా వైపు కూడా తీసుకువెళ్లారు“ అంటూ రాజ్ నాథ్ పార్ల‌మెంట్ లో వెల్ల‌డించారు.

భార‌త్, చైనా స‌రిహ‌ద్దు వెంబ‌డి జ‌రుగుతోన్న అంశాల‌ను కులంకుషంగా చ‌ర్చించాల‌ని కాంగ్రెస్ నేత‌లు పార్ల‌మెంట్ వేదిక‌గా డిమాండ్ చేస్తున్నారు. 2020 ఏప్రిల్ ల‌ఢ‌క్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆక్ర‌మ‌ణ‌లు, అతిక్ర‌మ‌ణ‌లు, అక్ర‌మ నిర్మాణాలు స‌రిహ‌ద్దుల్లో జ‌రిగాయో చ‌ర్చించాల‌ని విప‌క్ష నేత‌లు కోరుతున్నారు. కానీ, తాజాగా తవాంగ్ వ‌ద్ద జ‌రిగిన సంఘ‌ట‌న గురించి మాత్ర‌మే రాజ్ నాథ్ సింగ్ పార్ల‌మెంట్ వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేశారు. కానీ, కాంగ్రెస్ తో పాటు విప‌క్షాలు మాత్రం భార‌త్, చైనా బోర్డ‌ర్ వ‌ద్ద జ‌రుగుతోన్న అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేయాల‌ని కోరారు. భార‌త భూభాగంలోకి గ‌తంలోనే చైనా సైన్యం వ‌చ్చింద‌ని కాంగ్రెస్ చేస్తోన్న ఆరోప‌ణ‌. వాటి వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించ‌డానికి గ‌తంలోనే ప్ర‌య‌త్నం చేసింది. కానీ, ప్ర‌భుత్వం మాత్రం చైనా ఆక్ర‌మ‌ణ‌లు, అతిక్ర‌మ‌ణ‌ల‌ను దాచేస్తోంద‌ని కాంగ్రెస్ విమ‌ర్శిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • agitation in Parliament
  • congress
  • India China
  • Rajnath singh

Related News

Indiramma Houses

CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమ‌వారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండవ దశను ప్రారంభించనున్నారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ పథకం మొదటి దశ కింద కేరమేరి మండలం, కొత్తారి గ్రామంలో కోలం తెగకు చెందిన ఆదివాసుల కోసం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహప్రవేశం చేస్తారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండ

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Balka Suman

    BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

Latest News

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd