HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pakistani Forces Stood By The Terrorists They Made This Fight Their Own Indian Defense Officials

Pak With Terrorists: ఉగ్రవాదులకు అండగా పాక్ ఆర్మీ.. అందుకే తిప్పికొట్టాం: భారత్

‘‘పాకిస్తాన్ దాడులు చేసిన సమయంలో భారత(Pak With Terrorists) గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయి.

  • By Pasha Published Date - 03:35 PM, Mon - 12 May 25
  • daily-hunt
Pak With Terrorists Indian Defense Officials Pakistani Forces With Terrorists

Pak With Terrorists: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అనేది పాకిస్తాన్‌పై పోరాటం కాదని, ఉగ్రవాదంపై పోరాటమని భారత త్రివిధ దళాల అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాద స్థావరాలను భారత సేనలు ధ్వంసం చేస్తుండగా పాకిస్తాన్ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టామని వెల్లడించారు.  భారత సేనలు ఉద్దేశపూర్వకంగా పాక్ సైన్యంపై దాడులు చేయలేదని వారు తేల్చి చెప్పారు. పాకిస్తాన్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని ఆరోపించారు. పాకిస్థాన్‌ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు.‘ఆపరేషన్‌ సిందూర్‌’పై ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత సైనిక ఉన్నతాధికారులు రాజీవ్ ఘయ్, ఏకే భారతి,  ఏఎన్ ప్రమోద్‌లు మాట్లాడారు.

Also Read :Pakistan Map : కశ్మీరును పాక్‌లో కలిపేసేలా మ్యాప్‌‌‌.. చిన్న పొరపాటే అంటున్న డీకే

భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయి

‘‘పాకిస్తాన్ దాడులు చేసిన సమయంలో భారత(Pak With Terrorists) గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయి. దీనివల్ల పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్ల ఆటలు సాగలేదు. పాకిస్తాన్ దాడులకు ప్రతిచర్యగానే మేం పాక్‌లోని నూర్‌ఖాన్‌, రహీమ్‌యార్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌లపై దాడి చేశాం’’ అని భారత త్రివిధ దళాల అధికారులు తెలిపారు. భారత్ దాడి చేసిన దృశ్యాలను వారు ఈసందర్భంగా మీడియా ప్రతినిధుల ఎదుట ప్రదర్శించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌ ’లో భాగంగా మే 7న జరిపిన దాడుల్లోనూ భారత సేనలు కేవలం ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు.

Also Read :India-Pak : భారత్‌, పాక్‌ చర్చలు వాయిదా.. ప్రధాని, అజిత్ దోవల్ కీలక చర్చలు

ఆకాశ్‌ గగనతల రక్షణ వ్యవస్థలను వాడుకున్నాం

‘‘పాకిస్తాన్ జరిపిన దాడుల్లో భారత సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశాం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్‌ గగనతల రక్షణ వ్యవస్థను ఈ ఆపరేషన్‌లో సమర్థంగా వినియోగించాం. భారత సైన్యం పాకిస్తాన్ సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం చేయలేదు. చైనా తయారు చేసిన పీఎల్‌-15 క్షిపణిని భారత సైన్యం నేలకూల్చింది. పాకిస్తాన్‌కు చెందిన అనేక డ్రోన్లు, మిసైళ్లను భారత్ కూల్చింది’’ అని భారత త్రివిధ దళాల అధికారులు వెల్లడించారు. ‘‘భారత్‌ వైపు పాకిస్తాన్ గగనతల దాడులను తక్షణమే పసిగట్టి నిలువరించాం. ఎయిర్‌క్రాఫ్ట్‌ కేరియర్లు, రాడార్లు, ఫ్లీట్‌, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు, డ్రోన్లు, హైస్పీడ్‌ మిసైళ్లను వినియోగించాం. నౌకాదళ అడ్వాన్స్‌ రాడార్ల ద్వారా పాక్‌ డ్రోన్లను గుర్తించాం’’ అని వైస్‌ అడ్మిరల్‌ ప్రమోద్‌ వివరించారు. ‘‘పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టే క్రమంలో భారత త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయి. మన స్వదేశీ ప్రతిస్పందన వ్యవస్థ చాలా బలమైంది. సైన్యానికి అండగా నిలిచిన 140 కోట్ల మంది ప్రజలకు ధన్యవాదాలు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది’’ అని ఆయన ప్రకటించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Indian Defense Officials
  • Operation Sindoor
  • Pak With Terrorists
  • pakistan
  • Pakistani Forces
  • terrorists

Related News

Nepal Currency

Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?

చైనా ప్రతి రంగంలోనూ తన పట్టును బలోపేతం చేసుకుంటోంది. కరెన్సీ ముద్రణలో కూడా అదే చేసింది. చైనా బ్యాంక్‌నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ (CBPMC) అనే చైనా ప్రభుత్వ సంస్థ ఇప్పుడు నేపాల్ కరెన్సీని ముద్రిస్తోంది.

  • Hal Gubbi Volcano

    Volcano : బద్దలైన అగ్నిపర్వతం.. భారత్ పై ఎఫెక్ట్

  • Indian Girl

    Indian Girl: చైనాలో భార‌త మహిళకు వేధింపులు.. 18 గంటలు హింసించిన అధికారులు!

  • India

    India: పాకిస్తాన్‌కు భారత్ భారీ షాక్.. కొత్త ఆయుధంతో వణుకుతున్న శత్రుదేశాలు!

  • Terror Attack8

    Terror Attack Plan : మరో ఉగ్ర దాడికి జైషే కుట్ర?

Latest News

  • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

  • World Largest City: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద నగరం ఏదో తెలుసా?!

  • Telangana Global Summit : హైదరాబాద్ ఒక చారిత్రక క్షణానికి సాక్ష్యం కాబోతుంది – సీఎం రేవంత్

  • Yarlagadda Venkata Rao : గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వినూత్న ఆలోచనకు శ్రీకారం!

  • Telangana Global Summit : చరిత్ర సృష్టించబోతున్న హైదరాబాద్

Trending News

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd