Pakistan Flags In Uttarakhand: ఉత్తరాఖండ్లో పాక్ జెండాలు, బ్యానర్లు కలకలం
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని తుల్యాడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పాకిస్థాన్ జెండాలు,బ్యానర్లు (Pakistan Flags, Banners) కలకలం రేపాయి. వాటిలో ఒక బ్యానర్ ఉర్దూలో ఉందని,ఇంకో బ్యానర్పై LBAఅని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉందని ఉత్తర కాశీ ఎస్పీ అర్పణ్ యదువంశీ తెలిపారు.
- By Gopichand Published Date - 08:35 AM, Sun - 1 January 23
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని తుల్యాడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పాకిస్థాన్ జెండాలు,బ్యానర్లు (Pakistan Flags, Banners) కలకలం రేపాయి. వాటిలో ఒక బ్యానర్ ఉర్దూలో ఉందని,ఇంకో బ్యానర్పై LBAఅని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉందని ఉత్తర కాశీ ఎస్పీ అర్పణ్ యదువంశీ తెలిపారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని ఓ అడవిలో పాకిస్థాన్ జెండా, లేత ఆకుపచ్చ రంగు బెలూన్లతో చుట్టిన రెండు బ్యానర్లు కనిపించడంతో పోలీసులు, నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. అధికారులు శనివారం (డిసెంబర్ 31, 2022) ఈ సమాచారాన్ని అందించారు.
ఉత్తరకాశీ పోలీసు సూపరింటెండెంట్ అర్పన్ యదువంశీ మాట్లాడుతూ.. ఒక బ్యానర్ ఉర్దూలో, మరొక బ్యానర్ పెద్ద అక్షరాలతో ‘LBA’ అని వ్రాయబడిందని, ఇది ‘క్యాబినెట్ లాహోర్ బార్ అసోసియేషన్’ అని సూచిస్తుందని, శుక్రవారం తుల్యాడ గ్రామ సమీపంలోని అడవిలో బెలూన్లకు కట్టిన జెండా, బ్యానర్ లభ్యమైనట్లు తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు తెలియజేశామని పోలీసు సూపరింటెండెంట్ అర్పణ్ యదువంశీ తెలిపారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని తుల్యాడ గ్రామ వాసులు శుక్రవారం పోలీసులకు తెలియజేసినట్లు ధరసు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కమల్ కుమార్ లుంఠి తెలిపారు.
Also Read: Drugs : కోల్కతాలో డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్.. రూ. 5 కోట్ల విలువైన..!
ఇటీవల డిసెంబర్ 18, 2022న పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా డేరా బాబా నానక్లో ఉన్న BSF చందు వాడాలా పోస్ట్ సమీపంలో 250 మీటర్ల ఎత్తులో అనుమానాస్పద డ్రోన్ కనిపించింది. ఓ వార్తా సంస్థ ప్రకారం.. పాకిస్తాన్ డ్రోన్ భారత భూభాగంలో కనిపించింది. భారత సైనికులు కాల్పులు జరపడంతో డ్రోన్ తిరిగి పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది. పాకిస్థాన్ డ్రోన్ దాదాపు 15 సెకన్ల పాటు భారత భూభాగంలో ఉండిపోయిందని నివేదికల్లో పేర్కొంది. సరిహద్దులో మోహరించిన బీఎస్ఎఫ్ జవాన్లు సుమారు 40 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆరు బాంబులను పేల్చారు. దీని తర్వాత డ్రోన్ తిరిగి పాకిస్థాన్ సరిహద్దుకు వెళ్లింది. భారతదేశంలోని పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుండి చొరబాటు ప్రయత్నాలు తరచుగా కనిపిస్తాయి. డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.
Related News
India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. సోషల్ మీడియాలో ప్రోమో వీడియో వైరల్..!
T20 వరల్డ్ కప్ 2024.. IPL 2024 ఫైనల్ తర్వాత ప్రారంభమవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది.