HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Pak Backed Lashkar Front Claims Responsibility For Kashmir Bus Terror Attack

Terror Attack : కశ్మీర్ ఉగ్రదాడి మా పనే : పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఆదివారం రోజు జమ్మూ కశ్మీర్‌‌లోని రియాసీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి కలకలం రేపింది.

  • By Pasha Published Date - 01:23 PM, Mon - 10 June 24
  • daily-hunt
Terror Attack
Terror Attack

Terror Attack :ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఆదివారం రోజు జమ్మూ కశ్మీర్‌‌లోని రియాసీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి కలకలం రేపింది. వైష్ణోదేవీ ఆలయానికి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై జరిగిన ఈ దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 32 మంది గాయపడ్డారు.  చనిపోయిన వాళ్లంతా  ఉత్తరప్రదేశ్‌ వాస్తవ్యులని.. వీరంతా  కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తుండగా ఈ ఉగ్రదాడి(Terror Attack) జరిగిందని గుర్తించారు. అయితే ఈ దాడి తమ పనేనని తాజాగా పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) ప్రకటించింది. PAFF ఉగ్ర సంస్థ.. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ మద్దతుతో కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వైష్ణోదేవీ ఆలయ యాత్రికుల బస్సుపై దాడి ఘటనలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు భారత భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి.  ఉగ్రమూకల కోసం రియాసీలో భారత సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అటవీ ప్రాంతంలో సోదాలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

వచ్చే సంవత్సరం మే 5న గోవా వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు తమ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరవుతారని పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం రోజు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే కశ్మీర్‌లో ఉగ్రదాడి జరగడం గమనార్హం. దీంతో బిలావల్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయన పర్యటన షెడ్యూలు ప్రశ్నార్ధకంగా మిగిలింది. చివరిసారిగా భారత్‌లో పర్యటించిన  పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్. ఆమె  2011లో భారత్‌కు వచ్చి వెళ్లారు.

Also Read :Modis First Signature : ప్రధానిగా తొలి సంతకం చేసిన మోడీ.. ఆ ఫైలుపై సిగ్నేచర్ !

తాజాగా కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి భారత్ – పాక్ సంబంధాలను ప్రతికూలంగా  ప్రభావితం చేసే అవకాశం ఉంది.  26/11 ముంబై ఉగ్రదాడిలో దాదాపు 179 మంది ప్రాణాలను కోల్పోయారు. అప్పట్లో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా ఆ దాడికి పాల్పడింది.  నాటి నుంచి పాకిస్తాన్, భారత్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో రాజీపడబోమని భారత్ పదే పదే పాకిస్తాన్‌కు, చైనాకు స్పష్టం చేస్తూ వస్తోంది. దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతను అణగదొక్కే అన్ని ప్రయత్నాలను ఎదుర్కోవడానికి గట్టి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని భారత్ హెచ్చరిస్తోంది.

Also Read : Chandrababu New Convoy : చంద్రబాబు కోసం సిద్ధమైన కొత్త కాన్వాయ్‌


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kashmir
  • Lashkar Front
  • pakistan
  • Terror Attack

Related News

Upendra Dwivedi

Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Operation Sindoor : భారత-పాక్‌ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

  • A massive earthquake shook Afghanistan, killing more than 250 people

    Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

  • Nobel Peace Prize

    Nobel Peace Prize: నోబెల్ బహుమతి పొందాలని ఆశ‌ప‌డిన ట్రంప్‌.. భారీ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Latest News

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd