HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Operation Sindoor Inflicts Heavy Losses On Terrorist Organizations Jaish E Mohammed Lashkar E Taiba Hizbul Mujahideen

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దెబ్బ‌తో ఆ మూడు ఉగ్రవాద సంస్థల అధినేత‌ల‌కు భారీ దెబ్బ‌.. వాళ్ల‌కు ఎంత నష్టం వాటిల్లిందంటే?

భార‌త సైన్యం చేప‌ట్టిన ఆపరేషన్ సిందూర్ తో మూడు ఉగ్రవాద సంస్థ‌ల‌కు ఎంత నష్టం వాటిళ్లింది.

  • By News Desk Published Date - 10:37 PM, Wed - 7 May 25
  • daily-hunt
Operation Sindoor
Operation Sindoor

Operation Sindoor: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధ‌రాత్రి 1:05 గంటల నుండి 1:30 గంటల వరకు ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్ ప్రాంతంలోని, పాకిస్తాన్‌లోని నిషేధిత ఉగ్రవాద సంస్థల స్థావ‌రాల‌పై భార‌త సైన్యం మెరుపు దాడులు నిర్వ‌హించింది. జైషే మహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన మొత్తం తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మూడు ఉగ్రవాద సంస్థల అధిపతులు దాక్కున్న ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. మొత్తం 80 నుంచి 100మంది వ‌ర‌కు ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం. భార‌త సైన్యం చేప‌ట్టిన ఆపరేషన్ సిందూర్ తో మూడు ఉగ్రవాద సంస్థ‌ల‌కు ఎంత నష్టం వాటిళ్లిందో తెలుసుకుందాం.

 

హఫీజ్ సయీద్..
లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ కుంచుకోట మురిడ్కే, షావాయి నల్లా ( పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో లష్కరే తోయిబాకు ఒక ప్రధాన శిబిరం). మరియు మర్కజ్ అహ్లే హదీస్ (బరణాల) ప్రాంతాల్లోని స్థావ‌రాల‌పై భార‌త్ వైమానిక దాడులు చేసింది. మురిడ్కేలో ఉన్న శిబిరాన్ని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం అని కూడా పిలుస్తారు. ఉగ్రవాదులు శిక్షణ పొందినది ఇక్కడే. ఈ రహస్య స్థావరం అంతర్జాతీయ సరిహద్దు నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బర్నాలా., షావాయి నల్లాలోని రహస్య స్థావరాలలో ఉగ్రవాదులకు ఆయుధాలు, ఐఈడిలలో శిక్షణ ఇవ్వబడింది. ప్ర‌స్తుతం ఆ ప్రాంతాల్లో భార‌త‌సైన్యం మెరుపుదాడులు చేయ‌డంతో భారీ న‌ష్టం వాటిళ్లింది.

 

మసూద్ అజార్ ..
భార‌త సైన్యం చేసిన మెరుపుదాడుల‌తో అతిపెద్ద దెబ్బ జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు తగిలింది. బహవల్ పూర్ లో ఆ ఉగ్ర‌వాద సంస్థ‌ ప్రధాన కార్యాలయం ఉంది. సర్జల్, బిలాల్ క్యాంప్, కోట్లిలోని లాంచ్ ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. బహవల్ పూర్ జైషే కు అతిపెద్ద ఆపరేషన్ హబ్. బహవల్‌పూర్‌లోని కేంద్రం అంతర్జాతీయ సరిహద్దు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు ఆపరేషన్ సిందూర్‌లో మరణించారు. మసూద్ అజార్ అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, ఇతర మేనల్లుళ్ళు, ఆ కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు మరణించారు. ఈ దాడిలో మసూద్ అజార్ సన్నిహితుడు, అతని తల్లి, మరో ఇద్దరు సన్నిహితులు కూడా మరణించారు. దాడిలో తన కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత మసూద్ అజార్ తీవ్రంగా ఏడ్చిన‌ట్లు తెలిసింది.

 

సయ్యద్ సలావుద్దీన్ ..
భార‌త సైన్యం మెరుపు దాడుల‌తో ఉగ్రవాది ఖారీ మహ్మద్ ఇక్బాల్ కూడా మరణించాడు. కోట్లిలోని ఉగ్రవాద శిబిరాన్ని ఖారీ ఇక్బాల్ నడిపేవాడు. ఖారీ ఇక్బాల్‌తో పాటు, 10 మంది ఉగ్రవాదులు కూడా మరణించారు. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ రహస్య స్థావరాలపై కూడా వైమానిక దాడులు జరిగాయి. కోట్లి, మెహమూనా జోయా (సియాల్‌కోట్), రహిల్ షాహిద్ క్యాంప్ ధ్వంసం అయ్యాయి. హిజ్బుల్ ముజాహిదీన్ కు త‌ల‌దాచుకునే చాలా స్థావరాలు పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్ లో అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు నుంచి 10 నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • HIZBUL MUJAHIDEEN
  • jaish e mohammed
  • lashkar e taiba
  • Operation Sindoor

Related News

A new chapter in India's defense system... Negotiations with Russia for the purchase of S-400

S-400 : భారత రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం..ఎస్-400 కొనుగోళ్లకు రష్యాతో చర్చలు

ఈ వ్యవస్థల తయారీదారు రోసోబోరోనెక్స్పోర్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చల గురించి, రష్యా సైనిక-సాంకేతిక సహకార సంస్థ చీఫ్ దిమిత్రి షుగేవ్ స్పష్టం చేశారు. భారతదేశం ఇప్పటికే ఎస్-400 వ్యవస్థలను వినియోగిస్తున్నప్పటికీ, భవిష్యత్తు ముప్పులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని యూనిట్లు అవసరమవుతున్నాయని ఆయన చెప్పారు.

  • Key victory for security forces.. Most wanted terrorist, 'Human GPS' killed

    J&K : భద్రతా బలగాలకు కీలక విజయం.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ‘హ్యూమన్ జీపీఎస్’ హతం

  • Pakistan has agreed to ceasefire for just 50 weapons: Air Force officer

    Operation Sindoor : 50 ఆయుధాలకే..కాల్పుల విరమణకు దిగివచ్చిన పాక్ : వాయుసేన అధికారి

Latest News

  • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

  • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

  • Luxury Cars: సెప్టెంబర్ 22 త‌ర్వాత ఎలాంటి కార్లు కొనాలి?

  • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

  • YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

Trending News

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

    • GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd