CEC Rajiv Kumar: ఎన్నికల వేళ హింసను నిరోధించేందుకు సీ విజిల్ పేరుతో అప్లికేషన్
- Author : Latha Suma
Date : 05-03-2024 - 4:39 IST
Published By : Hashtagu Telugu Desk
CEC Rajiv Kumar: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పశ్చిమ బెంగాల్(Bengal)లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో హింసను సహించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో హింసను నిరోధించేందుకు ఎన్నికల సంఘం సీ విజిల్ పేరుతో అప్లికేషన్ను ప్రారంభించబోతుందన్నారు. సీ-విజిల్ అంటే సివిలియన్ టూ విజిలెంట్ అని అర్థమన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, హింస రహితంగా ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని రాజీవ్ కుమార్ అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికల్లో భయాందోళనలకు, బెదిరింపులకు తావు లేదని, అధికారుల పక్షపాత వైఖరిని సహించబోమన్నారు. బెంగాల్లో తగిన సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన సీ విజిల్ అప్లికేషన్ ఫీచర్స్ వివరాలను వివరించారు. ఎన్నికలకు ఎలాంటి అక్రమాలకు, హింసకు సిద్ధమైతే, వినియోగదారులు ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేస్తారన్నారు. 100 నిమిషాల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏ అభ్యర్థికైనా క్రిమినల్ నేపథ్యం ఉంటే.. ఈ యాప్ ద్వారా అభ్యర్థిని గుర్తించవచ్చని చీఫ్ తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా తమ వెబ్సైట్లతో పాటు పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
read also : Telangana: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎం: ప్రధాని మోదీ
రాబోయే లోక్సభ ఎన్నికల కోసం కేవలం మహిళలు మాత్రమే నిర్వహించనున్నారని.. ఆ ఎన్నికల కేంద్రాల వద్ద మహిళా భద్రతా బలగాలను మోహరిస్తారన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలు పూర్తిగా దివ్యాంగులతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తాము ఎవరికీ తక్కువ కాదని నిరూపించేందుకే ఉదాహరణగా నిలుస్తారన్నారు. అయితే, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన సన్నాహకాలను పరిశీలించేందుకు బెంగాల్ బృందం సోమవారం పర్యటించింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF)ని మాత్రమే మోహరించాలని సమావేశంలో బీజేపీ కోరింది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే కేంద్ర బృందాలను మోహరించాలని విజ్ఞప్తి చేసింది.