Nandini Gupta: ఫెమినా మిస్ ఇండియాగా 19 ఏళ్ల నందిని గుప్తా..!
రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా (Nandini Gupta) ఫెమినా మిస్ ఇండియా 2023 (Femina Miss India World 2023) టైటిల్ను గెలుచుకుంది. అదే సమయంలో శ్రేయా పూంజా మొదటి రన్నరప్గా ప్రకటించగా, రెండవ స్టార్ తోనా ఓజుమ్ లువాంగ్ను రెండో రన్నరప్గా ప్రకటించారు.
- Author : Gopichand
Date : 16-04-2023 - 7:56 IST
Published By : Hashtagu Telugu Desk
రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా (Nandini Gupta) ఫెమినా మిస్ ఇండియా 2023 (Femina Miss India World 2023) టైటిల్ను గెలుచుకుంది. అదే సమయంలో శ్రేయా పూంజా మొదటి రన్నరప్గా ప్రకటించగా, రెండవ స్టార్ తోనా ఓజుమ్ లువాంగ్ను రెండో రన్నరప్గా ప్రకటించారు. నందినికి సినీ శెట్టి పట్టాభిషేకం చేశారు. గతేడాది మిస్ ఇండియాగా సినీ శెట్టి నిలిచింది. ‘ఫెమినా మిస్ ఇండియా 2023’ మణిపూర్లో నిర్బహించారు.
ప్రతిష్ఠాత్మక 59వ ఎడిషన్ ఫెమీనా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. ఇందులో 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే వంటి సినీ తారలు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
Also Read: Pakistan: లీటర్ పెట్రోల్ పై రూ.10-14 పెంచబోతున్న పాకిస్థాన్.. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.272..!
నందిని గుప్తా రాజస్థాన్లోని కోట నివాసి. ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడింది. ఆమె చాలా కాలం నుండి మోడలింగ్ పట్ల మక్కువ కలిగి ఉంది. అదే ఆమెని ఈ రోజు ఈ స్థాయికి తీసుకువచ్చింది. నందిని మోడలింగ్తో పాటు చదువులో కూడా చాలా తెలివైనది. ఆమె సెయింట్ పాల్ సీనియర్ సెకండరీ స్కూల్ నుండి తన ప్రారంభ విద్యను అభ్యసించింది. లాలా లజపతిరాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతోంది. ఆమె కేవలం 10 సంవత్సరాల వయస్సులో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ను పొందాలని కలలు కన్నానని పేర్కొంది. 19 సంవత్సరాల వయస్సులో ఆమె ఈ కలను నిజం చేసుకుంది. ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా, మణిపూర్కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ వరుసగా మొదటి, రెండో రన్నరప్గా నిలిచారు.