HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄India
  • ⁄Modi Millet Indias Millet Mission Will Be Blessing For 2 5 Crore Marginal Farmers Says Pm Modi

Modi Millet :ఆరోగ్య‌క‌ర ఆహారం మిల్లెట్స్:గ్లోబ‌ల్ స‌ద‌స్సులో మోడీ

చిరు ధాన్యాల(Modi Millet) యుగం మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది. పండించే రైతుల‌ను(Farmers)

  • By CS Rao Published Date - 04:57 PM, Sat - 18 March 23
Modi Millet :ఆరోగ్య‌క‌ర ఆహారం మిల్లెట్స్:గ్లోబ‌ల్ స‌ద‌స్సులో మోడీ

చిరు ధాన్యాల(Modi Millet) యుగం మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది. వాటిని పండించే రైతుల‌ను(Farmers) ప్రోత్స‌హించడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రంగంలోకి దిగారు. న్యూఢిల్లీలోని పూసాలో జ‌రిగిన మిల్లెట్స్ (చిరుధాన్యాల‌, శ్రీ అన్న‌) స‌ద‌స్సును శ‌నివారం ఆయ‌న ప్రారంభించారు. ప్ర‌పంచ మేలు కోసం చిరు ధాన్యాల ఉత్ప‌త్తులు పెర‌గాల‌ని రైతుల‌కు పిలుపు నిచ్చారు. భారతదేశపు మిల్లెట్ మిషన్ 2.5 కోట్ల మంది సన్నకారు రైతులకు వరంగా మారుతుంద‌ని మోడీ ఆశాభావాన్ని వ్య‌క్త‌పరిచారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చిరు ధాన్యాలు పండించే రైతుల‌ అవసరాలపై శ్రద్ధ చూపడం ఇదే ప్ర‌ధ‌మం. ఆ విష‌యాన్ని మోడీ గుర్తు చేస్తూ రాబోవు రోజుల్లో చిరుధాన్యాల‌కు భార‌త్ ప్ర‌పంచ కేంద్రం కావాల‌ని అన్నారు.

చిరు ధాన్యాల యుగం (Modi Millet)

ప్ర‌స్తుతం చిరు ధాన్యాల‌ను(Modi Millet) 13 రాష్ట్రాల రైతులు పండిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో, ప్రతి వ్యక్తి గృహ వినియోగం నెలకు 2-3 కిలోల ఉండేది. ఇప్పుడు నెలకు 14 కిలోలకు వ‌ర‌కు పెరిగింద‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు. చిరు ధాన్యాలను న్యూట్రి-తృణధాన్యాలు అని కూడా పిలుస్తార‌ని మోడీ అన్నారు. జాతీయ ఆహార ఉత్ప‌త్తిలో చిరుధాన్యాల వాట‌ 5-6 శాతం మాత్రమే ఉంది. ఆ వాటాను పెంచడానికి భారతదేశ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు వేగంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. లక్ష్యాలను (Farmers)నిర్దేశించుకోవాల‌ని ప్రధాని మోదీ సూచించారు.

Also Read : PM Narendra Modi: మోదీని అధికారం నుంచి దించాలని చూస్తున్న ఇంగ్లండ్, అమెరికా..!

ప్రపంచ ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా, ప్రపంచ మేలు కోసం గ్లోబ‌ల్ మిల్లెట్స్ (Modi Millet)స‌ద‌స్సులు నిర్వ‌హించడం ద్వారా భార‌త్ బాధ్యత తీసుకోవాల‌ని అన్నారు. ప్రపంచం ‘అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్’ని జరుపుకుంటున్నప్పుడు, భారతదేశం ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉంద‌ని మోదీ అన్నారు.

Also Read : Millets: మిల్లెట్స్ ఖావో.. హెల్త్ బచావో..!

ఐక్యరాజ్యసమితి 2023ని ‘అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’గా ప్రకటించడం వెనుక భార‌త దేశం ప్ర‌య‌త్నం ఉంద‌ని గుర్తు చేశారు. ఇది దేశానికి గొప్ప గౌరవమ‌ని కొనియాడారు. భారతదేశంలోని 75 లక్షల మందికి పైగా రైతులు(Farmers) ఈ వేడుక వాస్తవంగా మాతో ఉన్నాయ‌ని ఫీల్ అవుతున్న‌ట్టు వెల్ల‌డించారు. గ్లోబల్ మిల్లెట్స్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 అధికారిక నాణేలను ఆవిష్కరించారు.

అంతర్జాతీయ మిల్లెట్స్  సంవత్సరం 2023

ప్రారంభోత్సవానికి హాజరైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ (Modi Millet)సంవత్సరంగా ప్రకటించడం వల్ల దేశీయంగా, ప్రపంచ వ్యాప్తంగా ‘శ్రీ అన్న’ కోసం డిమాండ్ పెరిగింద‌ని అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చిరు ధాన్యాల ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం వ‌స్తోన్న షుగ‌ర్ ,బీపీ రోగాల‌కు విరుగుడుగా మిల్లెట్స్ ను ఆయుర్వేద డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. అంతేకాదు, స‌ర్వ‌రోగ నివార‌ణిగా మిల్లెట్స్ ను కొంద‌రు ఔత్సాహికులు స‌దస్సుల ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు. ఇటీవ‌ల ఆరోగ్యంపై ప్ర‌జ‌ల్లోనూ అవ‌గాహ‌న పెరుగుతోంది. చిరు ధాన్యాల వాడ‌కం కూడా పెరిగింది. అందుకు త‌గిన విధంగా ఉత్ప‌త్తిని పెంచ‌డానికి మోడీ పిలుపు నిచ్చారు.

Also Read : Unlimited Food: రూ.60కి తిన్నంత ఆహారం. వేస్ట్ చేసారో జరిమానా తప్పదు!

Telegram Channel

Tags  

  • BJP Modi
  • farmers
  • india millets
  • millets
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

CM KCR: రైతుల ఖాతాల్లోకే 10 వేల నష్టపరిహారం: కేసీఆర్ ఆదేశం

CM KCR: రైతుల ఖాతాల్లోకే 10 వేల నష్టపరిహారం: కేసీఆర్ ఆదేశం

ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు.

  • Harish Rao: తెలంగాణ సరే.. గుజరాత్ సంగతేంటి? బండిపై హరీశ్ రావు ఫైర్

    Harish Rao: తెలంగాణ సరే.. గుజరాత్ సంగతేంటి? బండిపై హరీశ్ రావు ఫైర్

  • CM KCR: ఎకరాకు 10 వేల నష్ట పరిహారం: రైతులకు సీఎం కేసీఆర్ హామీ!

    CM KCR: ఎకరాకు 10 వేల నష్ట పరిహారం: రైతులకు సీఎం కేసీఆర్ హామీ!

  • BJP : టాలీవుడ్ `క‌మ‌ల`గుబాళింపు,మోడీ-షా`మెగా`ఎత్తుగ‌డ‌

    BJP : టాలీవుడ్ `క‌మ‌ల`గుబాళింపు,మోడీ-షా`మెగా`ఎత్తుగ‌డ‌

  • Delhi Tour : మోడీతో జ‌గ‌న్ భేటీ `ప్ర‌త్యేక‌హోదా` కోస‌మ‌ట!

    Delhi Tour : మోడీతో జ‌గ‌న్ భేటీ `ప్ర‌త్యేక‌హోదా` కోస‌మ‌ట!

Latest News

  • Philippine Ferry Fire: ఫిలిప్పీన్స్ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం.. 31 మంది మృతి

  • Jagan Delhi : ముగిసిన జ‌గ‌న్ ఢిల్లీ చ‌క్కర్లు, అసెంబ్లీ ర‌ద్దు?

  • Bird Flu: చిలీలో కలకలం.. మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు..!

  • Power Strike: మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్న విద్యుత్ ఉద్యోగులు.. డెడ్ లైన్ ఫిక్స్!

  • America:అమెరికాలోని కేతుంకిలో ఢీకొన్న రెండు ఆర్మీ హెలికాప్టర్లు. 6గురు సైనికులు మృతి

Trending

    • Business Idea : మీ ఊరిలో ఖాళీ స్థలం ఉందా, ఈ పండ్ల తోటతో నెలకు రూ. 1 లక్ష పక్కా…పెట్టుబడి అవసరం లేదు…!

    • Kuno National Park: 70 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతం..4గురు పిల్లలకు తల్లి అయిన సియా..అసలు కథ ఇదే..

    • UPI Payment is Free: అంతా ఏప్రిల్ ఫూల్…యూపీఐ చార్జీల విషయంలో జరిగింది ఇదే…

    • UPI Payments: ఇకపై UPI ద్వారా పేమెంట్స్ చేస్తే మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే..!

    • ISRO Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‎న్యూస్ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..జీతం రూ. 40వేలకే పైనే

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: