Massive fire: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ముంబైలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటుచేసుకుంది. పరేల్ ప్రాంతంలోని ఓ బిల్డింగ్ లోని ఓ అంతస్తులో ఒక్కసారిగా మంటలు (Massive fire) చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.
- By Gopichand Published Date - 01:16 PM, Thu - 15 December 22
ముంబైలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటుచేసుకుంది. పరేల్ ప్రాంతంలోని ఓ బిల్డింగ్ లోని ఓ అంతస్తులో ఒక్కసారిగా మంటలు (Massive fire) చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 4 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 22వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టుగా నివేదించబడలేదు. అగ్నిప్రమాదం వల్ల దట్టమైన పొగ వెలువడుతుంది. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read: 3 Students Suicide: కోటాలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య.. రాజస్థాన్ ప్రభుత్వానికి NHRC నోటీసులు
కొన్ని రోజుల క్రితం ముంబైలోని మలాద్ ప్రాంతంలో నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ భవనం 21 అంతస్థులని ముంబై సిఎఫ్ఓ తెలిపారు. దాని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
గత నెల నవంబర్ 14న ముంబైలో ఒకేసారి రెండు చోట్ల అగ్నిప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు ఒకవైపు వార్తలు వినిపిస్తుండగా, మరోవైపు ముంబైలోని అంధేరీ ఎంఐడీసీలో అగ్నిప్రమాదం సంభవించింది. బైకుల్లాలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే 6 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అంధేరి MIDCలో కూడా 5 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చాలా శ్రమ తర్వాత రెండు చోట్ల మంటలు అదుపులోకి వచ్చాయి.
Related News
Shadnagar Fire: షాద్ నగర్ అగ్ని ప్రమాదంలో 50 మందిని తాడు సహాయంతో కాపాడిన బాలుడు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది సిబ్బంది చిక్కుకున్నారు. మంటలు భయంకరంగా ఎగసిపడుతుండగా బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.