PM Modi: మోడీకి మరో గౌరవం, ప్రధానికి ‘లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం’
భారత ప్రధాని నరేంద్ర మోడీ లోకల్ టు గ్లోబల్ అంటూ దూసుకుపోతున్నారు.
- By Balu J Published Date - 01:22 PM, Mon - 31 July 23
భారత ప్రధాని నరేంద్ర మోడీ లోకల్ టు గ్లోబల్ అంటూ దూసుకుపోతున్నారు. తన ఛారిష్మాతో ఎన్నో విశిష్టమైన అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రపంచ వేదికపై అరుదైన పురస్కరాలను అందుకున్నారు. అందుకే మోడీని బీజేపీ వర్గాలు విశ్వ గురువు అని సంబోంధిస్తుంటాయి. తాజాగా మోడీకి మరో జాతీయ పురస్కారం లభించబోతోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు మహారాష్ట్రలోని పూణెలో పర్యటించనున్నారు. ఉదయం దగ్దుషేత్ మందిరంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం.. దేశ పురోగతికి, అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు అందిచే లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని మోదీ అందుకోనున్నారు. లోకమాన్య తిలక్ వర్ధంతి సందర్భంగా ప్రతీ ఏటా తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ఈ పురస్కారాలను 1983 నుంచి అందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోది ఈ పురస్కారాన్ని అందుకుంటున్న 41వ వ్యక్తి కావటం విశేషం.
ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్ పేయీ, ఇందిరా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, N.R.నారాయణ మూర్తి, డాక్టర్ శ్రీధరన్ వంటి ప్రముఖులు అందుకున్నారు. అనంతరం ప్రధాని మెట్రో రైళ్లను ప్రారంభించడంతోపాటు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తారు.
Also Read: Siberian Birds: అతిధులు వచ్చేశాయ్.. కనువిందు చేస్తున్న సైబీరియన్ పక్షులు
Related News
Iran President Death: భారత్ ఇరాన్కు అండగా నిలుస్తోందని మోడీ భరోసా
ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి మరియు మత నాయకుడు మహ్మద్ అలీ అలె-హషేమ్లతో పాటు రైసీ కూడా మరణించారు.