Kolkata : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిపికెట్ల పై కలకత్తా హైకోర్టు సంచల తీర్పు
- By Latha Suma Published Date - 08:44 PM, Wed - 22 May 24
![Kolkata : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిపికెట్ల పై కలకత్తా హైకోర్టు సంచల తీర్పు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/Kolkata-High-Court-Cancels-.jpg)
OBC certificates : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్ల(OBC certificates)ను రద్దు చేస్తూ.. కోలకత్తా హైకోర్టు(Kolkata High Court) ఈరోజు (బుధవారం) సంచలన తీర్పు ఇచ్చింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
అంతేకాక, పశ్చిమ బెంగాల్(West Bengal) వెనుకబడిన తరగతుల చట్టం 1993కు అనుగుణంగా రాష్ట్ర బీసీ కమిషన్(State BC Commission) ఓబీసీల తాజా జాబితా రూపొందించాలని కోర్టు ఆదేశించింది. 2010 తర్వాత తయారుచేసిన ఓబీసీ జాబితా చట్టవిరుద్ధమని హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం, 2012లోని సెక్షన్ 2హెచ్, 5,6, సెక్షన్ 16, షెడ్యూల్ 1, షెడ్యూల్ 3లు రాజ్యాంగవిరుద్ధమని కొట్టివేసింది.
Read Also: Water After Meal : భోజనం చేసిన వెంటనే నీళ్లెందుకు తాగకూడదు?
కాగా, 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు(OBC Certificates) అన్నీ 1993 (బీసీ కమిషన్) చట్టాన్ని ఉల్లంఘించి జారీ చేశారని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. వాస్తవంగా వెనుకబడిన తరగతుల వారికి దక్కాల్సిన సర్టిఫికెట్లు వారికి లభించలేదని పేర్కొంది. కోర్టు ఆదేశాలతో 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యాయి. కాగా, 2010కి ముందు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లపై తీర్పు ప్రభావం ఉండదు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Kanchenjunga Express Crash: కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ సంతాపం](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Kanchanjungha-Express-collided-with-a-goods-train_11zon.jpg)
Kanchenjunga Express Crash: కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ సంతాపం
పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగురిలో జరిగిన రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దీంతో పాటు కాంచనజంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.