Karnataka Polls: కర్ణాటక రిజల్ట్ పై రాహుల్ భవిష్యత్తు?
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది
- By Praveen Aluthuru Published Date - 03:58 PM, Sun - 23 April 23
Karnataka Polls: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీకి మరింత ఆదరణ పెరుగుతుంది అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇటీవల రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఆయన లోక్ సభకు అనర్హుడయ్యారు. ఈ ఇష్యూ అనంతరం వచ్చే మొదటి ఎన్నికలు కాబట్టి, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ బలమైన నాయకుడిగా ఎదగవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2024 అసెంబ్లీ ఎన్నికలలోపు రాహుల్ గాంధీ తనను తాను నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం అని భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వాన్ని మార్చే ధోరణి కర్ణాటకలో ఉంది. ఇదే జోరు కొనసాగితే ఈసారి కాంగ్రెస్కు మంచి అవకాశం దక్కుతుంది. ఇక్కడ విజయం సాధిస్తే పార్టీలో రాహుల్ గాంధీ స్థాయి మరింత పెరగవచ్చు. ఈ పోరులో కాంగ్రెస్ ముందు బీజేపీ, జేడీఎస్ ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్లు అత్యధికంగా లింగాయత్ అభ్యర్థులను నిలబెట్టగా, జేడీఎస్ అత్యధికంగా వొక్కలింగ కులస్థులకు టిక్కెట్లు ఇచ్చింది.
పార్లమెంటు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీకి సానుభూతి లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ కోల్పోయిన అధికారం మళ్లీ వస్తుందని భావిస్తున్నారు. 2018లో కాంగ్రెస్ మొత్తం 80 సీట్లకు దిగజారగా, బీజేపీ 104 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ ఎనిమిది జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఈ జిల్లాల్లో గుల్బర్గా, చిక్కబల్లాపూర్, కోలార్, బీదర్, రాయచూర్, బళ్లారి, బెంగళూరు, బెంగళూరు రూరల్ మరియు చామరాజనగర్ ఉన్నాయి.
గత ఆరు నెలలుగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తన సత్తా చాటింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి ఎంత కీలకంగా మారాయని రాహుల్ గాంధీ పర్యటనలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే బీజేపీ నేతలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం ఆ పార్టీ నేతల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేతలను బుజ్జగించడం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలకు సవాలుగా మారనుంది.
Read More: CSK Vs KKR: నేడు కోల్కతా, చెన్నై జట్ల మధ్య మ్యాచ్.. ఎంఎస్ ధోనీ పైనే అందరి కళ్లు..!
Related News
PM Modi : రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ఎన్నికల ప్రచారం సందర్భంగా రిజర్వేషన్ల అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.