HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Indians Death Count Rises To 41 In Nepal Road Accident

Maharashtra : ‘మహా’ విషాదం.. నదిలో పడిన బస్సు.. 41 మంది మృతి

వీరిలో 40 మంది మహారాష్ట్రకు చెందిన యాత్రికులే కాగా, మిగతా ముగ్గురు బస్సులో పనిచేసే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిబ్బంది అని అంటున్నారు.

  • By Pasha Published Date - 09:16 AM, Sat - 24 August 24
  • daily-hunt
Indians Death Count In Nepal Accident

Maharashtra : నేపాల్‌లోని తనహున్ జిల్లాలో భారత ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు నదిలో పడిపోయిన ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ బస్సులోని 43 మందిలో 41 మంది చనిపోయారని అధికార వర్గాలు ప్రకటించాయి. వీరిలో 40 మంది మహారాష్ట్రకు చెందిన యాత్రికులే కాగా, మిగతా ముగ్గురు బస్సులో పనిచేసే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిబ్బంది అని అంటున్నారు. మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ కూడా ఈ మరణాల వివరాలను ధృవీకరించారు. డెడ్‌బాడీలను తీసుకొచ్చేందుకుగానూ నేపాల్ ప్రభుత్వం, ఢిల్లీలోని నేపాల్(Maharashtra) ఎంబసీతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. ఈక్రమంలో తమకు నేపాల్‌లోని భారత ఎంబసీ నుంచి సహకారం లభిస్తోందన్నారు.

We’re now on WhatsApp. Click to Join

భారతీయ పర్యాటకుల మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చే అంశంపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే..  కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ కేంద్ర అధికారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం షిండేకు అమిత్ షా హామీ ఇచ్చారు. భారతీయ వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం ఆదివారం రోజు 24 మంది పర్యాటకుల మృతదేహాలను నాసిక్‌కు తీసుకువస్తుంది. అనంతరం వాటిని బాధిత కుటుంబాలకు అప్పగిస్తారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ మహారాష్ట్ర సీఎం షిండే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి శుక్రవారం రాత్రి సమయానికి బస్సులోని 43 మందిలో 27 మందే చనిపోయారు. మిగతా 16 మంది క్షతగాత్రులను ఆస్పత్రుల్లో  చేర్పించగా, చికిత్స పొందుతూ 14 మంది ప్రాణాలు విడిచారు.

Also Read :Confirm Train Ticket: రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ట్రైన్‌లో సీటు పొందండిలా..!

మహారాష్ట్రలోని జల్‌గావ్‌‌కు చెందిన యాత్రికులు తొలుత ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేపాల్‌లోని పోఖారాకు చేరుకున్నారు. శుక్రవారం రోజు నేపాల్‌లోని పోఖారా నుంచి రాజధాని ఖాట్మండు వైపు బస్సు వెళ్తుండగా.. మార్గం మధ్యలో తనహున్ జిల్లా ఐనాపహారా వద్ద బస్సు అదుపు తప్పి మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. దాదాపు 150 మీటర్ల ఎత్తు నుంచి నదిలో బస్సు పడటంతో అందులోని 41 మంది చనిపోయారు.

Also Read :Ormax Media Top 10 Actors : టాప్ 1 ప్రభాస్.. ఆర్మాక్స్ టాప్ 10 స్టార్స్ లో ఐదుగురు తెలుగు స్టార్స్..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Indians Deaths
  • Maharashtra
  • Nepal
  • Nepal Road Accident

Related News

Total lunar eclipse on the 7th..Which zodiac signs are auspicious according to astrology? Which zodiac signs are inauspicious?..!

Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

ఈ గ్రహణం రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:27 గంటలకు ముగియనుంది. మొత్తం 3 గంటల 30 నిమిషాల పాటు ఇది కొనసాగుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణంగా ఉండటం వల్ల, ఇది సాధారణ చంద్రగ్రహణాల కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వచ్చి ఎర్రటి వెలుతురుతో మెరిసిపోతాడు.

  • Trade War

    Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • Upendra Dwivedi

    Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • Do you know who was the first person to buy the first Tesla car in India?

    Tesla Car : భార‌త్‌లో తొలి టెస్లా కారు.. కొన్న మొద‌టి వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

  • Ajit Pawar in controversy.. inappropriate comments on female IPS officer

    Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd