HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Indians Death Count Rises To 41 In Nepal Road Accident

Maharashtra : ‘మహా’ విషాదం.. నదిలో పడిన బస్సు.. 41 మంది మృతి

వీరిలో 40 మంది మహారాష్ట్రకు చెందిన యాత్రికులే కాగా, మిగతా ముగ్గురు బస్సులో పనిచేసే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిబ్బంది అని అంటున్నారు.

  • Author : Pasha Date : 24-08-2024 - 9:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indians Death Count In Nepal Accident

Maharashtra : నేపాల్‌లోని తనహున్ జిల్లాలో భారత ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు నదిలో పడిపోయిన ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ బస్సులోని 43 మందిలో 41 మంది చనిపోయారని అధికార వర్గాలు ప్రకటించాయి. వీరిలో 40 మంది మహారాష్ట్రకు చెందిన యాత్రికులే కాగా, మిగతా ముగ్గురు బస్సులో పనిచేసే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిబ్బంది అని అంటున్నారు. మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ కూడా ఈ మరణాల వివరాలను ధృవీకరించారు. డెడ్‌బాడీలను తీసుకొచ్చేందుకుగానూ నేపాల్ ప్రభుత్వం, ఢిల్లీలోని నేపాల్(Maharashtra) ఎంబసీతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. ఈక్రమంలో తమకు నేపాల్‌లోని భారత ఎంబసీ నుంచి సహకారం లభిస్తోందన్నారు.

We’re now on WhatsApp. Click to Join

భారతీయ పర్యాటకుల మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చే అంశంపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే..  కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ కేంద్ర అధికారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం షిండేకు అమిత్ షా హామీ ఇచ్చారు. భారతీయ వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం ఆదివారం రోజు 24 మంది పర్యాటకుల మృతదేహాలను నాసిక్‌కు తీసుకువస్తుంది. అనంతరం వాటిని బాధిత కుటుంబాలకు అప్పగిస్తారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ మహారాష్ట్ర సీఎం షిండే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి శుక్రవారం రాత్రి సమయానికి బస్సులోని 43 మందిలో 27 మందే చనిపోయారు. మిగతా 16 మంది క్షతగాత్రులను ఆస్పత్రుల్లో  చేర్పించగా, చికిత్స పొందుతూ 14 మంది ప్రాణాలు విడిచారు.

Also Read :Confirm Train Ticket: రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ట్రైన్‌లో సీటు పొందండిలా..!

మహారాష్ట్రలోని జల్‌గావ్‌‌కు చెందిన యాత్రికులు తొలుత ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేపాల్‌లోని పోఖారాకు చేరుకున్నారు. శుక్రవారం రోజు నేపాల్‌లోని పోఖారా నుంచి రాజధాని ఖాట్మండు వైపు బస్సు వెళ్తుండగా.. మార్గం మధ్యలో తనహున్ జిల్లా ఐనాపహారా వద్ద బస్సు అదుపు తప్పి మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. దాదాపు 150 మీటర్ల ఎత్తు నుంచి నదిలో బస్సు పడటంతో అందులోని 41 మంది చనిపోయారు.

Also Read :Ormax Media Top 10 Actors : టాప్ 1 ప్రభాస్.. ఆర్మాక్స్ టాప్ 10 స్టార్స్ లో ఐదుగురు తెలుగు స్టార్స్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Indians Deaths
  • Maharashtra
  • Nepal
  • Nepal Road Accident

Related News

Vijay Mallya

Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

తాను భారత్‌కు తిరిగి వచ్చే ప్రసక్తే లేదని ఆయన బాంబే హైకోర్టుకు స్పష్టం చేశారు. తనను 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు' (Fugitive Economic Offender) గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్లను విచారించే క్రమంలో

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Indian Money

    Money Transaction : దేశంలో భారీగా చేతులు మారుతున్న డబ్బు

  • T20 World Cup 2026

    టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

  • UPI One World

    విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd