Vande Bharat: ఒడిశా ఎఫెక్ట్.. త్వరలో 5 వందేభారత్ రైళ్లు ప్రారంభం!
జూన్ 26 నుండి మరో ఐదు రూట్లలో వందే భారత్ రైళ్లను నడపడాన్ని రైల్వే ప్రారంభించనుంది.
- By Balu J Published Date - 05:25 PM, Wed - 14 June 23
ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్ రైల్వే డిపార్ట్ మెంట్ రక్షణ చర్యలకు దిగింది. జూన్ 26 నుండి మరో ఐదు రూట్లలో వందే భారత్ రైళ్లను నడపడాన్ని రైల్వే ప్రారంభించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రారంభించనున్నారు.
ముంబై-గోవా, బెంగళూరు-హుబ్లీ, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్ మరియు భోపాల్-జబల్పూర్ అనే ఐదు రైళ్లు నడిచే రూట్లలో ఉన్నాయి. ఒడిశా దుర్ఘటన తర్వాత ముంబై-గోవా వందే భారత్ రైలు ప్రారంభాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఐదు వందేభారత్ రైళ్లు ఒకే రోజు నడవడం ఇదే తొలిసారి. ఒడిశా ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: Megastar Chiranjeevi: రక్తదాతలే నిజమైన దేవుళ్లు: మెగాస్టార్ చిరంజీవి ట్వీట్!