HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Will Retaliate If Pakistan Opens Fire Pm Modi To Us Vice President Jd Vance

PM Modi Warning : ‘‘పాక్ కాల్పులు జరిపినా.. మేం దాడి చేస్తాం’’.. ప్రధాని మోడీ వార్నింగ్

మేం బలంగా ప్రతిస్పందిస్తాం’’ అని జేడీ వాన్స్‌కు మోడీ(PM Modi Warning) తేల్చి చెప్పారంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక కథనాన్ని ప్రచురించింది.

  • By Pasha Published Date - 06:23 PM, Sun - 11 May 25
  • daily-hunt
Pm Modi Warning Pakistan Us Vice President Jd Vance

PM Modi Warning : భారత త్రివిధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపితే, గట్టిగా బదులివ్వాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ‘‘పాకిస్తాన్ వాళ్లు ఒక్క తూటా పేలిస్తే, మీరు షెల్స్ తో కౌంటర్‌ ఇవ్వండి.. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదు. పాకిస్తాన్ కాల్పులు జరిపితే మేం ఎటాక్ చేస్తాం. వాళ్లు ఎటాక్ చేస్తే.. మేం మళ్లీ ఎటాక్ చేస్తాం’’ అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

Also Read :Gold From Lead : సీసాన్ని బంగారంగా మార్చేసే టెక్నాలజీ.. సైంటిస్టుల సక్సెస్

ఉగ్రవాద చర్యకు పాల్పడితే ఊరుకోం

భారత్ – పాకిస్తాన్‌ కాల్పుల విరమణ అంశంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇటీవలే చర్చలు జరిపారు. ఆ చర్చల సందర్భంగా జేడీ వాన్స్‌కు మోడీ ఒక విషయాన్ని క్లియర్‌గా చెప్పారట. ‘‘భవిష్యత్తులో భారతగడ్డపై పాకిస్తాన్ ఏదైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే మేం ఊరుకోం. అది తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేం బలంగా ప్రతిస్పందిస్తాం’’ అని జేడీ వాన్స్‌కు మోడీ(PM Modi Warning) తేల్చి చెప్పారంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక కథనాన్ని ప్రచురించింది.

మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు

పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్‌ విషయంలో భారత్‌ వైఖరి ఎప్పుడూ ఒక్కటే.. పీఓకేను భారత్‌కు అప్పగించడం తప్ప పాకిస్తాన్‌కు మరో మార్గం లేదు. పీఓకేను అప్పగించడం, ఉగ్రవాదులను సరెండర్‌ చేయడంపై మాత్రమే పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతాం. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు’’ అని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌కు మోడీ తేల్చి చెప్పారు. జేడీ వాన్స్‌కు మోడీ ఈవిషయాన్ని స్పష్టం చేసిన రోజు రాత్రే(శుక్రవారం అర్ధరాత్రి).. భారత్‌లోని 26 ప్రదేశాలపై పాకిస్తాన్ దాడికి దిగింది. ఈ దాడికి ప్రతిస్పందనగా వెంటనే (శనివారం ఉదయం) పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలపై భారత్ ప్రతిదాడులు చేసింది. భారత్ దాడులను పాకిస్తాన్ నిలువరించలేకపోయింది. పాకిస్తాన్ దాడులను భారత్ సులభంగా అడ్డుకోగలిగింది. సైనిక సంపత్తి, సాంకేతిక విలువలను సమతుల్యంగా వినియోగించడంలో భారత్ చాలా ముందంజలో ఉందని ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలతో నిరూపితమైంది.

Also Read :Ambanis Mango Empire: రిలయన్స్ మామిడి సామ్రాజ్యం.. 600 ఎకరాల్లో 1.30 లక్షల మ్యాంగో ట్రీస్

ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాలు

పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపులకు బలమైన జవాబివ్వాలని ఆర్మీకి ప్రధాని మోడీ నిర్దేశించారు.  ఈనేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక ప్రకటన చేశారు. మే 10న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్తాన్ ఆర్మీకి దీటైన జవాబిచ్చేందుకు భారత ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాలను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సమీక్షా సమావేశం

ఈరోజు(ఆదివారం)  భారత్‌లోని పశ్చిమ సరిహద్దు ప్రాంతాల ఆర్మీ కమాండర్లతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మే 10న రాత్రి నుంచి మే 11న తెల్లవారుజాము వరకు పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పాక్ సైన్యం భారత గగనతలంలోకి చొరబడింది. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. ఈ అంశాలపై ఈరోజు సమీక్షా సమావేశంలో చర్చించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • India vs Pakistan
  • JD Vance
  • pakistan
  • pm modi
  • PM Modi Warning
  • US Govt
  • us vice president

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • PM Modi

    PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

  • India Forex Reserve

    India Forex Reserve: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుదల!

Latest News

  • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

  • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

  • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

  • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

  • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd