HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >If The General Elections Are Held Before Time Are The Opposition Parties Ready

General Elections: సమయానికి ముందే సార్వత్రిక ఎన్నికలొస్తే విపక్షాలు సిద్ధమేనా..?

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని అధికార బిజెపి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.

  • By Hashtag U Published Date - 11:32 AM, Sun - 3 September 23
  • daily-hunt
General Elections
Compressjpeg.online 1280x720 Image (1) 11zon

By: డా. ప్రసాదమూర్తి

General Elections: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని అధికార బిజెపి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. దింతో దేశమంతా ఇదే విషయం మీద చర్చ కొనసాగుతోంది. రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నా యి. మేధావులు, రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అనేక రకాల విశ్లేషణలు చేస్తున్నారు. అందరి మాట ఎలా ఉన్నా, ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా తీసుకున్నాయనేది మనకు అర్థమవుతోంది.

ముంబైలో మూడోసారి సమావేశమైన ప్రతిపక్ష కూటమి, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అసలు ఉద్దేశం ఏమిటో తమకు పూర్తిగా బోధపడినట్టే అన్నట్టు నాయకులు మాట్లాడటం మొదలుపెట్టారు. ముంబైలో రెండు రోజుల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో సార్వత్రిక ఎన్ని కలు తొందరలోనే రావచ్చు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోడీసర్కార్ కు విపక్ష నాయకులు ఒక సవాలు విసిరారు.

పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఉద్దేశం ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనేదిగా పైకి కనిపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే మాజీ రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనితో దేశానికి విషయం స్పష్టమైపోయింది. అయితే ఇది సాధ్యమా, దీనికి రాజ్యాంగ సవరణ అవసరం కదా. దానికి పార్లమెంటు ఉభయ సభల నుంచి 60 శాతం, రాష్ట్రాల అసెంబ్లీల ప్రాతినిధ్యం నుంచి 50% ఆమోదం లభించాలి. ఈ విషయం మీద కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవడం అంత తేలికైన పని కాదు.

అయినా ఒక పని చేయొచ్చు. ఈ ప్రాసెస్ ని ముందుకు తీసుకు వెళుతూ, ఇప్పటికే దేశంలో నాలుగైదు సార్లు జరిగిన ప్రయోగం కనుక, దీన్ని తప్పనిసరిగా అమలులోకి తీసుకు వస్తే దేశం మీద అమితమైన ఎన్ని కల భారం తగ్గుతుందని బిజెపి వాదించవచ్చు. మొత్తం ఈ చర్చ మీద అందరి శక్తీ కేంద్రీక్రీృతమై ఉండవచ్చు. ఇదింత త్వరగా సాధ్యం కాని పక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలను సమీపంలో జరగనున్న రాష్ట్రాల ఎన్ని కలతో కలిపి చేయడానికి కేంద్రం ముందుకు సాగవచ్చు. అదీ విషయం.

Also Read: Nigar Shaji: ఆదిత్య L1 విజయం వెనుక మహిళా సైంటిస్ట్

ఈ విషయాన్ని దేశం ఎలా అర్థం చేసుకున్నా, ప్రతిపక్షాలు మాత్రం అసలు గుట్టు బోధపరుచుకున్నట్టు వారి మాటల్లోనే అర్థమవుతోంది. ముంబై సమావేశం తర్వాత ఆయా పార్టీల నాయకులు ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వెళ్లిపోయారు. అక్కడ మీడియాతో నాయకులు, ప్రతిపక్ష కూటమి INDIA తీసుకున్న నిర్ణయాలను, ఎన్నికల వ్యూహాన్ని మీడియాకు వివరిస్తూ, పార్లమెంట్ పత్ర్యేక సమావేశాల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ప్రతిపక్షాల కూటమికి పధ్రాన సూతధ్రారిగా వ్యవహరిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నిర్ధారిత సమయం కంటే ముందే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి మోడీ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

ఒకప్పుడు బిజెపితో కలిసి నడిచిన నాయకుడిగా నితీష్ కుమార్ కి బిజెపిలో కొన్ని అంతర్గత శక్తులతో గట్టి పరిచేయాలే ఉన్నాయి. ఆయన అన్నారంటే కచ్చితంగా ఇదే జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తేజస్వి యాదవ్ కూడా ఇదేమాట మాట్లాడారు. ఒకేదేశం ఒకే ఎన్నిక కాదు, ఒకే దేశం ఒకే ఆదాయం అని కేంద్రపభ్రుత్వం చెప్పొచ్చు కదా అని తేజస్వి యాదవ్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ పదేపదే మోడీ.. ఆదానీల మధ్య బంధాన్ని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రతిపక్షాల కూటమి బలపడుతున్న సంకేతాలు కేంద్రంలో అధికార పక్షానికి కొంచెం కంగారు పుట్టించేవిగా ఉన్నాయి. అందుకే నిర్ణీత గడువు లోపే ఎన్ని కలు జరపడానికి కేంద్రం పావులు కదుపుతోందన్న విషయం ప్రతిపక్ష నాయకుల ప్రతిఒక్కరి నోటి నుండి వ్యక్తమవుతోంది.

2023 డిసెంబర్ లోపు తెలంగాణ, రాజస్థాన్, మధ్యపద్రేశ్, చత్తీస్ గడ్, మిజోరం.. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ, అలాగే ఆంధప్రద్రేశ్, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ పద్రేశ్ లలో వచ్చే ఏడాదిజూన్ లోపు, 2024 ఆఖరిలో హర్యానా, మహారాష్ట్ర,ఝార్ఖండ్.. ఇలా ఒక సంవత్సరంలో 12 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. దేశవ్యా ప్తంగా అన్ని రాష్ట్రాల ఎన్నికలూ, సార్వత్రిక ఎన్నికలూ జమిలిగా సాగించేందుకు ఇప్పటికిప్పుడు రాజ్యాంగపరమైన నిబంధనలు అంగీకరించకపోవచ్చు. ఆ పక్రియ సాగించడానికి సమయం పట్టవచ్చు. అందుకే 2024 ఫిబవ్రరికల్లా ఈ 12 రాష్ట్రాలతో కలిసి సార్వత్రిక ఎన్నికలు జరిపే ఉద్దేశంలో కేంద్రపభ్రుత్వం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతిపక్ష పార్టీలు ఒక సమన్వయ కమిటీ వేసుకొని దాని ద్వారా సీట్ల షేరింగ్ ఒప్పందాన్ని వెంటనే పరిష్కరించుకొని, ఈ నెలాఖరుకల్లా ఎన్నికల పచ్రారానికి యుద్ధంలోకి దిగాలని తీర్మానించుకున్నా యి. మొత్తానికి దేశంలో జమిలి ఎన్నికల మాటేమో గానీ, మోదీ వ్యూహ రచనకు ప్రతిపక్షాల ప్రతివ్యూహ రచన జమిలిగా సాగుతోంది. ఎవరి వ్యూహం ఫలిస్తుందో కాలమే చెప్పాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • central govt
  • elections 2024
  • General Elections
  • Opposition PARTIES
  • pm modi

Related News

Bhatti Vikramarka

Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!

సింగరేణి కార్మికులకు 400 కోట్ల రూపాయల బోనస్ ఈనెల 18న రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బందులో యావత్ ప్రజానీకం, సకల వర్గాలు పాల్గొనాలి ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు కోసం బిజెపి నాయకులు సమయం తీసుకోండి సీఎం నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధం సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చాక చర్చించి ఈనెల 23న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటాం మీడియా

  • Folk Singer Maithili Thakur

    Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

  • PM Modi

    PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

  • Bihar Elections

    Bihar Elections : బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

Latest News

  • Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క మార్పు.. వ‌న్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌల‌ర్‌!

  • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ

  • Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్‌

  • Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!

Trending News

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd