Death Threat: “త్వరలో ముఖ్యమంత్రిని చంపేస్తా”.. మరోసారి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు బెదిరింపు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath)కు హత్య బెదిరింపులు (Death Threat) రావడంతో లక్నోలో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదైంది.
- By Gopichand Published Date - 10:35 AM, Tue - 25 April 23
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath)కు హత్య బెదిరింపులు (Death Threat) రావడంతో లక్నోలో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. లక్నో పోలీసులు మంగళవారం ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ‘డయల్ 112’ (అత్యవసర సేవల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నంబర్)కు సందేశం ద్వారా బెదిరింపు వచ్చినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. త్వరలో సీఎం యోగిని చంపేస్తానని వ్యక్తి బెదిరించినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు రావడంతో ‘112’ ఆపరేషన్ కమాండర్ సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 506, 507, ఐటీ యాక్ట్ 66 కింద కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై డయల్ 112కు హత్య బెదిరింపులు రావడంతో పోలీస్ స్టేషన్ సుశాంత్ గోల్ఫ్ సిటీలో ఐపీసీ సెక్షన్ 506, 507, ఐటీ యాక్ట్ సెక్షన్ 66 కింద గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 24న కొచ్చిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆత్మాహుతి బాంబు దాడి చేస్తామని బెదిరిస్తూ లేఖ రాసిన వ్యక్తిని ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడిని జేవియర్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నుతున్నట్లు తనకు గత వారం లేఖ అందిందని కేరళ బీజేపీ చీఫ్ కే. సురేంద్రన్ శనివారం తెలిపారు.
Also Read: Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. అనేక దుకాణాలు దగ్ధం, కోట్ల రూపాయల నష్టం
ప్రధాని మోదీని పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తిని గుర్తించామని, అతని పేరు జేవియర్ అని, అరెస్టు చేశామని కొచ్చి పోలీస్ కమిషనర్ కె సేతురామన్ తెలిపారు. దీనికి కారణం వ్యక్తిగత శత్రుత్వమేనని చెబుతున్నారు. పక్కవాడిని ట్రాప్ చేయడానికి ఈ లేఖ రాశాడు. ఫోరెన్సిక్ బృందం సహాయంతో మేము దానిని కనుగొన్నామన్నారు.
Related News
CM Yogi Adityanath: సైబర్ నేరగాళ్లకు చమటలే ఇక.. 57 కొత్త సైబర్ పోలీస్ స్టేషన్లు
ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సైబర్ నేరగాళ్ళను అరికట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమైంది. జాతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్క్రైమ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.