HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >High Alert In Bihar Jaish E Mohammed Terrorists Infiltration Scare Ahead Of Assembly Elections

Bihar : బిహార్‌లో హై అలర్ట్ : అసెంబ్లీ ఎన్నికల ముందే జైషే ఉగ్రవాదుల చొరబాటు కలకలం

నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదులను హస్నైన్‌ అలీ (రావల్పిండి), ఆదిల్‌ హుస్సేన్‌ (ఉమర్‌కోట్‌), మహ్మద్‌ ఉస్మాన్‌ (బహవల్‌పూర్‌)గా గుర్తించారు. వీరంతా పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్‌ ముఠాకు చెందినవారుగా పోలీసులు పేర్కొన్నారు.

  • By Latha Suma Published Date - 11:17 AM, Thu - 28 August 25
  • daily-hunt
High alert in Bihar: Jaish-e-Mohammed terrorists infiltration scare ahead of assembly elections
High alert in Bihar: Jaish-e-Mohammed terrorists infiltration scare ahead of assembly elections

Bihar : బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉగ్రవాద కలకలం చెలరేగింది. పాక్‌ మద్దతుతో పనిచేస్తున్న జైషే మహ్మద్‌ ముఠాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు బిహార్‌లోకి చొరబడినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన బిహార్‌ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌, ఈ ముగ్గురి ఫొటోలు, ఇతర వివరాలను విడుదల చేసింది.

ఉగ్రవాదుల వివరాలు

నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదులను హస్నైన్‌ అలీ (రావల్పిండి), ఆదిల్‌ హుస్సేన్‌ (ఉమర్‌కోట్‌), మహ్మద్‌ ఉస్మాన్‌ (బహవల్‌పూర్‌)గా గుర్తించారు. వీరంతా పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్‌ ముఠాకు చెందినవారుగా పోలీసులు పేర్కొన్నారు. ఆగస్టు రెండో వారం నపాల్‌ రాజధాని కాఠ్మాండూ చేరుకున్న ఈ ఉగ్రవాదులు, ఇటీవల బిహార్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం.

సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

నేపాల్‌ మీదుగా చొరబడిన ఈ ఉగ్రవాదులు, సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉండడంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని సీమాంచల్‌ ప్రాంతాలు, నేపాల్‌ సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచారు. బహిరంగ ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్‌ డిపోలు వంటి చోట్ల ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద నిత్య పట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

భద్రత కట్టుదిట్టం, రాహుల్‌ గాంధీ పర్యటన నేపథ్యంలో మరింత అప్రమత్తత

ప్రస్తుతం బిహార్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను మరింత బలపరిచింది. ఆయన పర్యటనలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటంతో పాటు, ఉగ్రవాదుల పట్ల అప్రమత్తంగా ఉన్నారు.

గత ఘటనలు, ఇప్పటికే నిఘా వర్గాల హెచ్చరికలు

ఇప్పటికే ఈ ఏడాది మే నెలలోనూ బిహార్‌లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిఘా వర్గాలు గుర్తించాయి. కేవలం 20 రోజుల్లో 18 మంది కొత్తవారు రాష్ట్రానికి రావడం గమనార్హం. వీరిలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఒకరు ఖలిస్థాన్‌ మద్దతుదారుగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.

సరిహద్దు రాష్ట్రంగా బిహార్‌ అపాయం

బిహార్‌ రాష్ట్రం సుమారు 729 కిలోమీటర్ల మేర నేపాల్‌తో సరిహద్దును పంచుకుంటోంది. ఇది అక్రమ చొరబాట్లకు అనుకూలంగా మారుతోంది. ఇదే కారణంగా ఉగ్రవాద సంస్థలు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేళ భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Read Also: Textile Industry : దేశీయ టెక్స్‌టైల్ పరిశ్రమకు ఊరట : పత్తి దిగుమతులపై సుంకాల మినహాయింపు

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • assembly elections
  • bihar
  • high alert
  • Jaish-e-Mohammed terrorists
  • Police Headquarters

Related News

Bihar Election 2025

Bihar Elections : అక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్?

Bihar Elections : ఈ సమీకరణల్లో బిహార్ ఎన్నికలు కేవలం రాష్ట్ర రాజకీయాలను మాత్రమే కాకుండా 2029 సాధారణ ఎన్నికలకూ సంకేతాలు ఇవ్వగలవు. అందువల్ల, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, విశ్లేషకులు బిహార్ దిశగా ఆసక్తిగా గమనిస్తున్నారు.

  • Kadiyam Srihari

    Kadiyam Srihari: ఎన్నికల్లో పోటీ చేయను.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

Latest News

  • ‎Negative Enegry: మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఈ వస్తువులను తొలగించాల్సిందే.. అవేటంటే!

  • Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రభుత్వానికి.. ఎల్‌అండ్‌టీ నుంచి పూర్తిస్థాయి స్వాధీనం

  • Man Ate Spoons: స్పూన్లు, టూత్‌ బ్రష్‌లు మింగిన వ్యక్తి: రిహాబ్‌ సెంటర్‌పై కోపంతో అర్థంలేని పని

  • Parijata: పారిజాత పూల రహస్యం: ఈ పుష్పాలను ఎవరు కోయకూడదో ఎందుకు తెలుసా?

  • SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

Trending News

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    • Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd