Independence Day 2023 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రత
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
- By Prasad Published Date - 09:46 AM, Sun - 13 August 23
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఎర్రకోటలో వివిధ సాయుధ దళాల పూర్తి దుస్తుల రిహార్సల్ చేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలను కోరారు. భారత జెండా స్వాతంత్య్రం, జాతీయ ఐక్యతకు ప్రతీక అని, ప్రజలు తిరంగాతో ఉన్న ఫోటోలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ప్రధాని మోదీ కోరారు. కాగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ జెండాను ఎగురవేసేందుకు భారతదేశం నలుమూలల నుంచి దాదాపు 1,800 మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాది 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ, గ్రామాల సర్పంచ్లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు, న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన శ్రమ యోగులు, ఖాదీ రంగ కార్మికులు, జాతీయ అవార్డు పొందిన పాఠశాల ఉపాధ్యాయులు, సరిహద్దు రహదారుల సంస్థ దేశంలోని వివిధ ప్రాంతాలలో అమలు చేయబడిన అమృత్ సరోవర్ ప్రాజెక్టులు, హర్ ఘర్ జల్ యోజన ప్రాజెక్టులకు సహాయం చేసిన, పనిచేసిన కార్మికులు మరియు వారి జీవిత భాగస్వామితో సహా ఈ సంవత్సరం న్యూఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఇద్దరు ‘ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం’ (PM-KISAN) లబ్ధిదారులు ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను చూడనున్నారు.
Related News
Mulugu: ములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద మృతి
ములుగు జిల్లాలో ఓ అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దారుణ ఘటన చోటుచేసుకుంది . ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో బుధవారం వెలుగు చూసింది. మృతురాలు సుజాత(48) మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్గా పని చేసింది.