Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన భోలే బాబా
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన ఈ దారుణ ఘటనపై రెండో రోజు భోలే బాబా స్పందించారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని భోలే బాబా అన్నారు.
- Author : Praveen Aluthuru
Date : 03-07-2024 - 9:36 IST
Published By : Hashtagu Telugu Desk
Hathras Stampede: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన ఈ దారుణ ఘటనపై రెండో రోజు భోలే బాబా స్పందించారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని భోలే బాబా అన్నారు. మంగళవారం జరిగిన తొక్కిసలాటకు సంఘ వ్యతిరేక శక్తులే కారణమని భోలే బాబా ఆరోపించారు.హత్రాస్లోని ఫుల్రాయ్ గ్రామంలో జూలై 2న నిర్వహించిన సత్సంగం ముగిసిన తర్వాత తొక్కిసలాటను సృష్టించిన సంఘవ్యతిరేక శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ ఏపీ సింగ్కు అధికారం ఉందని భోలే బాబా లేఖ ద్వారా తెలియజేశారు.
కాగా హత్రాస్ తొక్కిసలాట ఘటనతో ఉత్తరప్రదేశ్ మొత్తం శోకసంద్రం నెలకొంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్అధికారులపై మండిపడ్డారు. ఇది యాక్సిడెంట్ అయినా.. కుట్ర అయినా.. లోతుగా తేల్చి విచారణ జరిపి నిందితులను విడిచిపెట్టబోమని చెప్పారు. హత్రాస్ ప్రమాదంపై న్యాయ విచారణకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ కేసులో ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యోగి తెలిపారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై విచారణ జరుపుతుందని సీఎం యోగి తెలిపారు.
మంగళవారం హత్రాస్లోని సికంద్రరావు ప్రాంతంలోని ఫుల్రాయ్ గ్రామంలో భోలే బాబా సత్సంగం నిర్వహించబడింది, అందులో తొక్కిసలాట జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 121 మంది మరణించారు.
Also Read: Water Crisis : రిజర్వాయర్లలో తగ్గిన నీటి మట్టం.. తీవ్ర నీటి ఎద్దడి తప్పదా..?