H3N2: భారత్ లో కొత్త వైరస్ ! హర్యానా,కర్ణాటకలో ఇద్దరు మృతి
కొత్త వైరస్(H3N2) భారత్ ను చుట్టేస్తోంది. ఇప్పటి వరకు
- By CS Rao Published Date - 04:59 PM, Fri - 10 March 23
కరోనా కొత్త వైరస్(H3N2) భారత్ ను చుట్టేస్తోంది. ఇప్పటి వరకు హర్యాన, కర్ణాటక రాష్ట్రాల్లో (India)ఇద్దరు కొత్త వైరస్ సోకి మృతి చెందారు. ఎక్కువగా పిల్లలు, వృద్ధులకు ఈ వైరస్ ప్రమాదకరంగా మారిందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 90 కేసులు కొత్తగా నమోదు అయ్యాయని తేలింది. కొత్త వైరస్ ఎక్కువగా ఊపిరితిత్తుల మీద పడుతుందని వైద్యులు కొనుగొన్నారు. శ్వాస ఆడకుండా చేస్తుందని చెబుతున్నారు. హాంకాంగ్ ఫ్లూ కూడా ఈ కొత్త వైరస్ ను పిలుస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు విష జ్వరాలతో నిండిపోయాయి. కొత్త వైరస్ కారణంగా ఈ జ్వరాలు వస్తున్నాయని వరల్డ్ హల్త్. ఆర్గనైజేషన్ కూడా చెబుతోంది. ఇప్పటికే డబ్ల్యూయూహెచ్ వో అప్రమత్తం చేసింది.
కరోనా కొత్త వైరస్(H3N2)
కొత్తగా సోకుతోన్న వైరస్ ను హెచ్3ఎన్2(H3N2( గా గుర్తించారు. ఈ వైరస్ వల్ల భారత దేశంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. హర్యానాలో ఒకరు, కర్ణాటకలో మరొకరు మరణించారు. కర్ణాటకలోని హసన్లో 82 ఏళ్ల వృద్ధుడు హెచ్3ఎన్2తో మరణించిన మొదటి వ్యక్తిగా భావిస్తున్నారు. హిరే గౌడ ఫిబ్రవరి 24న ఆసుపత్రిలో చేరగా మార్చి 1న మరణించినట్లు అధికారులు తెలిపారు. అతను డయాబెటిక్ మరియు రక్తపోటుతో బాధపడుతున్నట్లు సమాచారం.
Also Read : Viral Fevers: అవి వైరల్ జ్వరాలు మాత్రమే, ఆందోళనవద్దు: ఏపీ వైద్యశాఖ!
దేశంలో(India) దాదాపు H3N2 వైరస్ కేసులు 90 నమోదయ్యాయి. ఎనిమిది H1N1 వైరస్ కేసులు కూడా కనుగొన్నారు. గత కొన్ని నెలలుగా దేశంలో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. “హాంకాంగ్ ఫ్లూ” అని కూడా పిలువబడే H3N2 వైరస్ వల్ల చాలా ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ వైరస్ దేశంలోని ఇతర వైరస్ ల బలమైనదిగా వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వెంటనే ఆసుపత్రిలో చేరడం మంచిదని అంటున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు H3N2 మరియు H1N1 ఇన్ఫెక్షన్లు మాత్రమే కనుగొనబడ్డాయి. ఇద్దరికీ కోవిడ్కు సమానమైన లక్షణాలు ఉన్నాయి.
పెరుగుతున్న ఫ్లూ కేసులు
ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్(H3N2) మిలియన్ల మందికి సోకింది. అంతేకాదు 6.8 మిలియన్ల మరణాలకు కారణమైంది. రెండు సంవత్సరాల తర్వాత కరోనా కొత్త రూపంలో వచ్చిన వైరస్ కారణంగా పెరుగుతున్న ఫ్లూ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిరంతర దగ్గు, జ్వరం, చలి, శ్వాస ఆడకపోవడం, గురకలు ప్రధాన లక్షణాలుగా గుర్తించారు. రోగులకు వికారం, గొంతు నొప్పి, శరీర నొప్పి , విరేచనాలు కూడా ఉంటాయని తేల్చారు. ఈ లక్షణాలు దాదాపు ఒక వారం పాటు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
అంటువ్యాధిగా ఉందని నిపుణులు
ఈ వైరస్ (H3N2) అంటువ్యాధిగా ఉందని నిపుణులు చెబుతున్నారు. దగ్గు, తుమ్ము సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం ద్వారా వ్యాపిస్తుంది. చేతులు మరియు మాస్క్లను క్రమం తప్పకుండా కడుక్కోవడంతో పాటు కోవిడ్ లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. తుమ్మినప్పుడు, దగ్గేటప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం మంచిదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సూచిస్తోంది. ద్రవాలు, కళ్ళు మరియు ముక్కును తాకకుండా ఉండటం , జ్వరం, శరీర నొప్పి కోసం పారాసెటమాల్ వాడుకోవచ్చని చెబుతోంది. దీర్ఘకాలిక వైద్య సమస్యల ఉన్న వాళ్లకు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులతో పాటు, పెద్దలు, చిన్న పిల్లలు వంటి అధిక-ప్రమాద సమూహాలకు సంక్రమణ తీవ్రంగా ఉండవచ్చని ఐసీఎంఆర్ వెల్లడించింది.
Also Read : Virus: ఉప్పెనలా మరో వైరస్… పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం!
Related News
Screen Time: మీ పిల్లలు అతిగా ఫోన్ వాడుతున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్తో ఫోన్కు దూరం చేయండిలా..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు స్క్రీన్-టైమ్ (Screen Time) సున్నాగా ఉండాలని, పిల్లల వయస్సు 2-5 సంవత్సరాలు అయినప్పటికీ గరిష్టంగా 1 గంటకు పరిమితం చేయాలని చెబుతుంది.