Budget 2024: లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!
సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ (Budget 2024)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి.
- By Gopichand Published Date - 11:20 AM, Thu - 1 February 24
Budget 2024: సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ (Budget 2024)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. దీంతో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె సమం చేశారు. అంతకుముందు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడానికి, ఉపాధి పొందేందుకు వీలుగా ప్రజల ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందించారు. సమ్మిళిత అభివృద్ధిపైనే ప్రభుత్వం దృష్టి సారించి, అన్ని వర్గాలకు, ప్రజలందరికీ అభివృద్ధి అనే చర్చ జరుగుతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ఆమె అన్నారు.
25 కోట్ల మంది ప్రజలను బహుమితీయ పేదరికం నుంచి బయటపడేయడంలో మోదీ ప్రభుత్వం విజయవంతమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి సారించిందన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతుల సాధికారతపై దృష్టి పెడుతోంది. 4 కోట్ల మంది రైతులకు ఫసల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనం ఇవ్వబడింది. 78 లక్షల మంది విక్రేతలకు పిఎం స్వానిధి పథకం కింద సహాయం అందించబడింది. జన్ ధన్ ద్వారా నేరుగా రూ.34 లక్షల కోట్ల నగదు బదిలీ అయిందన్నారు.
Also Read: Budget: మాల్దీవుల బడ్జెట్ 3.2 బిలియన్ డాలర్లు.. భారతదేశంతో పోలిస్తే ఎంత తక్కువో తెలుసా..?
బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో.. ఆర్థిక మంత్రి కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను ప్రస్తావించారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ అనే మోడీ ప్రభుత్వ విజన్ గురించి మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా పరివర్తన కాలం వచ్చిందని, భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పురోగమిస్తోందని అన్నారు. 2024 మధ్యంతర బడ్జెట్ను సమర్పించే సమయంలో ఆర్థిక మంత్రిత్వ నిర్మలా సీతారామన్ నీలం, క్రీమ్-రంగు టస్సార్ చీరను ధరించారు. నీలం రంగులో ఉన్న చీరమీద మొత్తం క్రీమ్-రంగు కాంత వర్క్ ఉంది. 2022లో సీతారామన్ రస్ట్ కలర్ గోధుమ రంగు బొమ్కై చీరను ఎంచుకున్నారు. 2020లో మంత్రి సన్నటి నీలం అంచుతో పూర్తిగా పసుపు రంగు పట్టు చీరలో కనిపించారు. 2019లో ఆమె గోల్డెన్ బార్డర్తో కూడిన గులాబీ రంగు మంగళగిరి చీరను ధరించింది.
We’re now on WhatsApp : Click to Join
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 11.8 కోట్ల మంది రైతులకు ప్రభుత్వ సహాయం అందించామని, కోట్లాది మంది రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలోని అన్నదాత ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ యోజన ప్రయోజనం 4 కోట్ల మంది రైతులకు అందించబడుతోంది. 300 యూనివర్శిటీలు స్థాపించి మూడో వంతు మహిళలకు రిజర్వేషన్ కల్పించామన్నారు.
Related News
Smriti Irani Vs Gandhis : ఏ ఛానలైనా, ఏ యాంకరైనా ఓకే.. గాంధీలకు స్మృతి ఇరానీ సవాల్
Smriti Irani Vs Gandhis : ఏ న్యూస్ ఛానలైనా ఓకే.. ఏ యాంకరైనా ఓకే.. ఏ స్థలమైనా ఓకే అంటూ ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సవాల్ విసిరారు.