HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Farooq Abdullah Jabs Bjp On Ic 814 Hijack Told Them Not To Release Terrorists

Kandahar Hijack : బీజేపీ ఉగ్రవాదులను వదిలేయబట్టే.. దేశం ఉగ్రదాడులను ఎదుర్కొంది : ఫరూక్ అబ్దుల్లా

తప్పుల తర్వాత తప్పులు చేస్తూ దేశాన్ని బలోపేతం చేస్తున్నామని బీజేపీ గొప్పలు చెప్పుకుంటే ఎలా అని ఫరూక్ అబ్దుల్లా(Kandahar Hijack) ప్రశ్నించారు. 

  • By Pasha Published Date - 03:54 PM, Thu - 12 September 24
  • daily-hunt
Farooq Abdullah Comments Kandahar Hijack

Kandahar Hijack : కాందహార్ హైాజాక్ ఘటనకు సంబంధించిన కీలక వివరాలను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత,  జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. ‘‘25 ఏళ్ల క్రితం ఢిల్లీకి వెళ్లే ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ 814 హైజాక్ అయింది. ఆ టైంలో బందీలను వదిలేసేందుకుగానూ తాము చెప్పే ముగ్గురు ఉగ్రవాదులను జైలు నుంచి రిలీజ్ చేయాలని హైజాకర్లు ప్రతిపాదించారు. అప్పటి బీజేపీ ప్రభుత్వానికి నేను ఒక్కటే విషయం చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గురు ఉగ్రవాదులను వదలొద్దని సూచించాను’’ అని ఆయన తెలిపారు. అయినా ఆనాటి బీజేపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. తప్పుల తర్వాత తప్పులు చేస్తూ దేశాన్ని బలోపేతం చేస్తున్నామని బీజేపీ గొప్పలు చెప్పుకుంటే ఎలా అని ఫరూక్ అబ్దుల్లా(Kandahar Hijack) ప్రశ్నించారు.

Also Read :BJLP Meeting : అసెంబ్లీలో బీజేఎల్పీ భేటీ.. కీలక నిర్ణయాలు, డిమాండ్లు ఇవే

‘‘ఆనాటి బీజేపీ ప్రభుత్వం ముగ్గురు ఉగ్రవాదులను వదిలేయబట్టే ఇప్పుడు ఉగ్రవాదం పెరిగిపోయింది. బీజేపీ సర్కారు చేసిన తప్పు వల్లే.. తర్వాతి కాలంలో ఎన్నో ఉగ్రవాద దాడులను భారత్ ఎదుర్కోవాల్సి వచ్చింది.  ఆ పర్యవసానాలను దేశ ప్రజలు అనుభవించారు’’ అని ఫరూక్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కాందహార్ హైజాక్ ఘటన జరిగిన టైంలో తాను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

Also Read :Balineni : వైసీపీకి మరో బిగ్ షాక్‌.. బాలినేని రాజీనామా?

‘‘ఉగ్రవాద సమస్య పరిష్కారం కోసం పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని నేను చెబుతుంటే.. బీజేపీ సర్కారు తప్పుపడుతోంది. చైనా మన దేశంలోకి చొరబడి భూమిని ఆక్రమిస్తున్నా.. శాంతిమంత్రమే ఎందుకు జపిస్తున్నారు ? చైనాతో చర్చలు మాత్రమే ఎందుకు చేస్తున్నారు ?’’ అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. చైనాతో శాంతిచర్చలు ఎంత ముఖ్యమో.. చైనా మిత్రదేశం పాకిస్తాన్‌తోనూ శాంతిచర్చలు అంతే ముఖ్యమని ఆయన తెలిపారు. ‘‘ప్రపంచంలో సుదూరంగా ఉన్న మిత్రదేశాలను మనం వదులుకున్నా పెద్దగా సమస్య ఉండదు. కానీ పొరుగునే ఉన్న మిత్రదేశాలను దూరం చేసుకోవద్దు. వారితో స్నేహంగానే ఉండాలి. అప్పుడే ఇరు దేశాలు అభివృద్ధి చెందుతాయి’’ అని ఫరూక్ అబ్దుల్లా సూచించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Farooq Abdullah
  • IC 814 hijack
  • Kandahar Hijack
  • Kandahar Hijack Terrorists

Related News

Bjp Ramachandra

CM Revanth : రేవంత్ ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది – రామచందర్ కీలక వ్యాఖ్యలు

CM Revanth : ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విషయానికొస్తే.. ఆయనపై నిరంతరం విమర్శలు చేయడం రేవంత్ అలవాటు చేసుకున్నారని రామచందర్ ఎద్దేవా చేశారు. రేవంత్ (CM Revanth) కు ఢిల్లీ వెళ్లి రావడమే సరిపోతుంది అని వ్యాఖ్యానించారు

    Latest News

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd