Sheikh Shahjahan: షేక్ షాజహాన్ ఆస్తులను ఈడీ అటాచ్
ఈడీ, సీఏపీఎఫ్ బృందాలపై దాడికి పాల్పడిన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్కు చెందిన సుమారు రూ.13 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది.
- Author : Vamsi Chowdary Korata
Date : 05-03-2024 - 11:23 IST
Published By : Hashtagu Telugu Desk
Sheikh Shahjahan: ఈడీ, సీఏపీఎఫ్ బృందాలపై దాడికి పాల్పడిన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్కు చెందిన సుమారు రూ.13 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. కోల్కతాలోని అపార్ట్మెంట్, వ్యవసాయ భూములు, మత్స్య సంపదకు సంబంధించిన భూమి, భవనాలు తదితర 14 స్థిరాస్తుల రూపంలో రూ. 12.78 కోట్ల విలువైన స్థిరాస్తులు, రెండు బ్యాంకు ఖాతాలను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.
కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ షాజహాన్ను సీబీఐ అధికారులకు అప్పగించేందుకు రాష్ట్ర పోలీసుల సీఐడీ నిరాకరించింది. కలకత్తా హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని పేర్కొంటూ షాజహాన్ను అప్పగించేందుకు సిఐడి నిరాకరించింది. పశ్చిమ బెంగాల్లో కోట్లాది రూపాయల రేషన్ పంపిణీ కేసు విచారణకు సంబంధించి షాజహాన్ను ప్రశ్నించేందుకు జనవరి 5న సీఏపీఎఫ్ సిబ్బందితో కూడిన ఈడీ బృందం అతని వద్దకు వెళ్ళింది.అయితే వారు షాజహాన్ ఇంటికి వెళ్లిన వెంటనే స్థానిక తృణమూల్ వెయ్యి మందికి పైగా మద్దతుదారులు ఈడీ మరియు సీఏపీఎఫ్ బృందాలపై దాడి చేశారు. ఈ దాడిలో ఈడీ అధికారులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.
Also Read: Nirmala Sitharaman: లాలూకి ఇచ్చి పడేసిన మంత్రి నిర్మలా సీతారామన్