HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Diplomatic War Against Pakistan Here Are The Details Of The Countries That Indias All Party Teams Will Visit

Diplomatic War : శశిథరూర్‌‌కు పెద్ద బాధ్యతలు.. అఖిలపక్ష టీమ్‌లు పర్యటించే దేశాలివీ

భారత్‌కు అత్యంత సన్నిహిత దేశం రష్యాకు సంబంధించిన పర్యటన బాధ్యతలను డీఎంకే ఎంపీ కనిమొళి(Diplomatic War) సారథ్యంలోని అఖిలపక్ష టీమ్‌కు అప్పగించారు. 

  • By Pasha Published Date - 12:35 PM, Sun - 18 May 25
  • daily-hunt
Diplomatic War On Pakistan India All Party Teams India Vs Pakistan

Diplomatic War : కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్‌‌కు కేంద్రంలోని మోడీ సర్కారు పెద్దపీట వేస్తోంది. ఈక్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం గురించి భారత ప్రభుత్వం తరఫున ప్రపంచ దేశాలకు వివరించేందుకు 7 అఖిలపక్ష టీమ్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో ఒక టీమ్‌ సారథ్య బాధ్యతలను శశిథరూర్‌‌కు మోడీ అప్పగించారు. ఈ అఖిలపక్ష టీమ్‌లు పర్యటించేందుకు వివిధ దేశాలను కేటాయించారు. ఇందులోనూ శశిథరూర్‌‌కు కేంద్ర సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.  కీలకమైన అమెరికా, బ్రెజిల్ దేశాల పర్యటన బాధ్యతను  శశిథరూర్‌ సారథ్యంలోని అఖిలపక్ష టీమ్‌కు అప్పగించారు. ఈ టీమ్ పనామా, గయానా, కొలంబియాలలో కూడా పర్యటిస్తుంది. పాకిస్తాన్ మిత్రదేశం తుర్కియేకు వేల కోట్లు విలువైన అమ్రామ్ మిస్సైళ్లను విక్రయించే డీల్‌కు ఇటీవలే అమెరికా పచ్చజెండా ఊపింది. దీనిపై భారత అఖిల పక్ష టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది.

కనిమొళి టీమ్ ఏ దేశాలకు.. 

భారత్‌కు అత్యంత సన్నిహిత దేశం రష్యాకు సంబంధించిన పర్యటన బాధ్యతలను డీఎంకే ఎంపీ కనిమొళి(Diplomatic War) సారథ్యంలోని అఖిలపక్ష టీమ్‌కు అప్పగించారు.  ఈ టీమ్ స్పెయిన్, గ్రీస్, స్లొవేనియా, లాత్వియా దేశాల్లోనూ పర్యటిస్తుంది.

సుప్రియా సూలే టీమ్ ఏ దేశాలకు.. 

మరో విపక్ష నాయకురాలు, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే సారథ్యంలోని అఖిలపక్ష టీమ్‌కు కీలకమైన దక్షిణాఫ్రికా, ఈజిప్ట్‌, ఖతర్‌‌లలో పర్యటించే అవకాశాన్ని కల్పించారు. ఈజిప్టు, ఖతర్‌లకు పాకిస్తాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సుప్రియా సూలే టీమ్ ఆఫ్రికా దేశం ఇథియోపియాలోనూ పర్యటిస్తుంది.

Also Read :India Pakistan Ceasefire : ‘కాల్పుల విరమణ’పై భారత ఆర్మీ కీలక ప్రకటన

సంజయ్‌కుమార్‌ ఝా టీమ్ ఏ దేశాలకు.. 

జేడీయూ నేత  సంజయ్‌కుమార్‌ ఝా సారథ్యంలోని అఖిలపక్ష టీమ్ కీలకమైన జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేసియా,సింగపూర్‌ దేశాలలో పర్యటిస్తుంది. ఇండోనేసియాతో పాక్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

శ్రీకాంత్‌ షిండే టీమ్ ఏ దేశాలకు.. 

శివసేన ఎంపీ శ్రీకాంత్‌ షిండే సారథ్యంలోని అఖిలపక్ష  టీమ్  యూఏఈలో పర్యటిస్తుంది. యూఏఈతో భారత్‌, పాక్ రెండు దేశాలతోనూ బలమైన సంబంధాలు ఉన్నాయి.  ఈ టీమ్ లైబీరియా, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, సియెర్రా లియోన్‌‌లలోనూ పర్యటిస్తుంది.

బైజయంత్‌ పాండా సారథ్యంలోని టీమ్.. 

బీజేపీ నేత బైజయంత్‌ పాండా సారథ్యంలోని అఖిలపక్ష టీమ్ కీలకమైన సౌదీఅరేబియా, కువైట్‌, బహ్రెయిన్‌, అల్జీరియాలలో పర్యటిస్తుంది. సౌదీ, అల్జీరియాలతో పాక్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

రవిశంకర్‌ ప్రసాద్‌ సారథ్యంలోని టీమ్..

బీజేపీ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ సారథ్యంలోని టీమ్ కీలకమైన బ్రిటన్ (యూకే), ఫ్రాన్స్‌, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, డెన్మార్క్‌‌లలో పర్యటిస్తుంది.

Also Read :Gulzar House : హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాదం.. 16 మంది మృతి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • All Party Teams
  • Countries
  • Diplomatic War
  • india
  • India vs Pakistan
  • pakistan

Related News

IND vs SL

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకుంది.

  • Suryakumar

    SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • Pakistan Bombs Its Own Peop

    Attack : సొంత ప్రజలపైనే పాక్ బాంబుల దాడి

Latest News

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd