HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Did Indira Gandhi Donated Gold For Indias Cause Here Is What Congress Says

Indira Gandhi : దేశం కోసం ఇందిరాగాంధీ నగలిచ్చారా ? ప్రధాని మోడీ ‘మంగళసూత్రాల’ ఆరోపణ నిజమేనా ?

Indira Gandhi : ఈ ఎన్నికల వేళ దేశంలో ప్రస్తుతం ఇద్దరు నేతల ప్రసంగాలపై అంతటా హాట్ డిబేట్ జరుగుతోంది. 

  • By Pasha Published Date - 12:18 PM, Wed - 24 April 24
  • daily-hunt
Indira Gandhi
Indira Gandhi

Indira Gandhi : ఈ ఎన్నికల వేళ దేశంలో ప్రస్తుతం ఇద్దరు నేతల ప్రసంగాలపై అంతటా హాట్ డిబేట్ జరుగుతోంది.  వారే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ !! ‘‘కాంగ్రెస్‌ దేశ సంపదను,  ఆడవాళ్ల నగల్ని కొల్లగొట్టి ముస్లింలకు పంచిపెడుతుంది’’ అని ప్రధాని మోడీ కామెంట్ చేశారు. ‘‘ఇందిరా గాంధీ దేశం కోసం తన మంగళసూత్రాన్ని త్యాగం చేశారు’’ అంటూ రాజీవ్‌ గాంధీ హత్యకు గురైన విషయాన్ని ప్రియాంకా గాంధీ గుర్తు చేశారు. ‘‘రాజీవ్ గాంధీ దేశం కోసమే ప్రాణాలు వదిలారు.  అంతేకాదు చైనాతో భారత్‌ యుద్ధంలో  ఉన్నప్పుడు మా నానమ్మ తన బంగారు ఆభరణాలన్నింటనీ దేశం కోసం ఇచ్చేశారు’’ అని ప్రియాంక పేర్కొన్నారు. గాంధీ కుటుంబ త్యాగాల్ని ప్రధాని మోడీ మర్చిపోవద్దని ప్రియాంక హితవు పలికారు. ప్రియాంకాగాంధీ చెబుతున్న విధంగా ఇందిరాగాంధీ(Indira Gandhi) నిజంగానే దేశం కోసం తన సొంత బంగారాన్ని ఇచ్చేశారా ? వివరాలు చూద్దాం..

कांग्रेस ने 55 साल में क्या किसी का सोना या मंगलसूत्र छीना? जब देश युद्ध लड़ रहा था, इंदिरा जी ने अपना मंगलसूत्र व गहने दान किए। लाखों महिलाओं ने इस देश के लिए अपने मंगलसूत्र कुर्बान किए। जब मेरी बहनों को नोटबंदी में अपने मंगलसूत्र गिरवी रखने पड़े, तब प्रधानमंत्री जी कहां थे? जब… pic.twitter.com/E5cfHZoJRR

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 23, 2024

We’re now on WhatsApp. Click to Join

ప్రియాంక చెప్పింది దీని గురించేనా ?

  • 1962 సంవత్సరంలో భారత్‌, చైనా యుద్ధానికి దిగాయి. చైనా ఆర్మీ భారత సరిహద్దుల్లో దురాక్రమణకు యత్నించింది. లద్దాఖ్‌లోని చుషూల్ ప్రాంతంలోకి చైనా సైన్యం చొచ్చుకొచ్చే యత్నం చేసింది. దీంతో భారత సైన్యం వాళ్లను ఎదుర్కొనేందుకు అప్పట్లో సమాయత్తం అయింది.
  • ఈ పరిస్థితుల నడుమ అప్పటి నెహ్రూ ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసింది. దేశంలోని మహిళలంతా తమ బంగారు ఆభరణాల్ని దేశం కోసం త్యాగం చేయాలని పిలుపును ఇచ్చింది. డబ్బులతో పాటు ఉలన్ దుస్తులను కూడా డొనేట్ చేయాలని కోరింది.
  • ఆ టైంలోనే నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ కూడా తన బంగారు ఆభరణాల్ని విరాళంగా ఇచ్చి ఉంటారని అంటారు.
  • అదే విషయాన్ని  తాజాగా ఇప్పుడు ప్రియాంకా గాంధీ తన ప్రసంగంలో ప్రస్తావించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Also Read : World Leader : అగ్రరాజ్యంగా మేం కాకుంటే ఇంకెవరు ఉంటారు ? : బైడెన్

ప్రధాని చెప్పింది దీని గురించేనా ?

  • చైనాతో మన దేశం యుద్ధంలో ఉన్న కష్టకాలంలో దేశంలో అందరికంటే ముందుగా ఇందిరా గాంధీ చొరవ చూపించి తన ఆభరణాల్ని విరాళంగా ఇచ్చారని అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయని చెబుతున్నారు.
  • ఈనేపథ్యంలో కొంతకాలం వరకు భారత్-చైనా యుద్ధం చేశాయి. అయితే ఆ తర్వాత చైనా తన సైన్యాన్ని వెనక్కి పిలుచుకుంది.
  • అప్పట్లో నెహ్రూ సర్కారు సేకరించిన బంగారు నగల లెక్కలు మాత్రం  అధికారికంగా  వెల్లడికాలేదు. చివరకు రిజర్వు బ్యాంకు రికార్డులలో కూడా ఈ సమాచారం అందుబాటులో లేకపోవడం గమనార్హం.
  • ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ   తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ..   ‘‘కాంగ్రెస్ పార్టీ మంగళసూత్రాలతో సహా దోచుకొని ముస్లింలకు ఇచ్చేస్తుంది’’ అని వ్యాఖ్యానించి ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Also Read :Aston Martin Vantage: వామ్మో.. ఈ కారు ధ‌ర ఎంతో తెలుసా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Donated Gold For Indias Cause
  • Indira Gandhi
  • Priyanka gandhi

Related News

Let's decide who will win!..KTR challenges CM Revanth Reddy

CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR

CM Revanth : రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు అన్నీ ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలకనుగుణంగానే జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తక్షణ మరమ్మతులు చేపట్టకుండా

  • Elections

    Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

  • Harish Rao

    Harish Rao: సీఎం రేవంత్‌ వారికి సాయం చేయ‌లేదు.. హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Latest News

  • Invest in Telangana : రాష్ట్రానికి రూ.15,279 కోట్ల పెట్టుబడులు- CMO

  • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

  • ‎Friday: ప్రతి శుక్రవారం ఇలా చేస్తే చాలు.. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!

  • Tulasi Plant: ‎తులసి మొక్క విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో!

  • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

Trending News

    • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

    • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd