HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Delhi Polls Result Shock To Arvind Kejriwal Bjp Towards Victory After 27 Years

Shock To Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్.. ఢిల్లీలో కమల వికాసం.. కారణాలివీ

న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Shock To Kejriwal) పోటీ చేస్తున్నారు. 

  • By Pasha Published Date - 10:39 AM, Sat - 8 February 25
  • daily-hunt
Delhi Polls 2025 Results Shock To Arvind Kejriwal Bjp Victory

Shock To Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు షాకిచ్చాయి. ఇప్పటివరకు (ఉదయం 10.25 గంటలు) వెలువడిన ఫలితాల ప్రకారం.. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ 40 చోట్ల బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఆప్ అభ్యర్థులు కేవలం 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. సంక్షేమ పథకాల హామీలతో ఢిల్లీ ప్రజలను ఆకట్టుకోవాలని యత్నించిన అరవింద్ కేజ్రీవాల్ వ్యూహం ఫలించలేదు. పదేళ్ల ఆప్ పాలనతో విసిగివేసారిన ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలలో దేన్ని ఎంచుకోవాలి ? అనే ప్రశ్నకు సమాధానంగా ‘బీజేపీ’ వైపు చూశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయితేనే ప్రస్తుతానికి బెటర్ అని హస్తిన ప్రజానీకం భావించారు. ఇదే అంశం ఇప్పుడు వెలువడుతున్న ఎన్నికల  ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read :Machilipatnam SBI : మచిలీపట్నమా మజాకా.. అక్కడి బ్యాంకుకు 219 ఏళ్ల చరిత్ర.. అదెలా ?

కేజ్రీవాల్, అతిషి వెనుకంజ

న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Shock To Kejriwal) పోటీ చేస్తున్నారు.  ప్రస్తుతం ఆయన వెనుకంజలో ఉన్నారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేష్ సింగ్ వర్మ ముందంజలో ఉన్నారు.  ఇక కల్కాజీ అసెంబ్లీ స్థానంలో ఆప్ అగ్రనేత, సీఎం అతిషి వెనకంజలో ఉన్నారు.

ఆప్‌ను దెబ్బతీసిన అంశాలు ఇవీ.. 

  • ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో మొదటిది అవినీతి ఆరోపణలు.
  • అరవింద్ కేజ్రీవాల్ నుంచి మొదలుకొని మనీశ్ సిసోడియా దాకా పార్టీ అగ్రనేతలంతా జైలుకు వెళ్లి వచ్చారు. ఈ అంశం వల్ల జనంలో ఆప్‌పై నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడింది.
  • జైలుకు వెళ్లినా సీఎం పదవిని కేజ్రీవాల్ వదులుకోక పోవడాన్ని ప్రజలు తప్పుపట్టారు. ప్రజాపాలన కంటే సీఎం పదవిని కాపాడుకునేందుకే కేజ్రీవాల్ మొగ్గుచూపారనే భావన జనంలో వచ్చింది. ఆప్ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో ఈ విషయాన్ని గుర్తించబట్టే, ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆయన సీఎం పదవిని వదులుకున్నారు.
  • ఆప్‌తో కాంగ్రెస్ పార్టీ దోస్తీని కోరుకుంది. కానీ ఆప్ మాత్రం అత్యాశకు పోయి ఒంటరి పోరాటానికి సిద్ధపడింది. దీంతో చాలా అసెంబ్లీ స్థానాల్లో ఆప్ ఓట్లను కాంగ్రెస్ విజయవంతంగా చీల్చింది.
  • ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసం నిర్మాణంలో జరిగిన అవకతవకల వ్యవహారం ప్రజలను ఆలోచింపజేసింది.
  • ఢిల్లీలోని వాయు కాలుష్యం, యమునా నదీ జలాల్లో కాలుష్యం అంశాలు ఢిల్లీ వాసులను ఆప్‌కు దూరం చేశాయి. గత పదేళ్లలో ఆప్ ఏమీ చేయలేకపోయిందనే భావన ఓటర్లకు వచ్చింది.
  • ఆప్ నుంచి కీలక నేతలు బీజేపీలోకి వలస వెళ్లడం అనేది .. ఆప్‌ను అంతర్గతంగా బలహీనం చేసింది. ఎన్నికల పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు దాదాపు 8 మంది ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ కావడం పెద్ద మైనస్ పాయింటుగా మారింది.

విక్టరీ దిశగా బీజేపీ 

ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ గెలుపు దిశగా పయనిస్తోంది.  చివరిసారిగా 1993లో ఢిల్లీలో బీజేపీ గెలిచింది. 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చింది. 2013, 2015, 2020 ఎన్నికల్లో ఆప్ విజయఢంకా మోగించింది.

Also Read :Cabinet Expansion : కాంగ్రెస్ హైకమాండ్ పరిధిలోకి మంత్రివర్గ విస్తరణ.. వాట్స్ నెక్ట్స్ ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arvind kejriwal
  • bjp
  • BJP victory
  • Delhi Polls 2025
  • Delhi Polls Result
  • Shock To Kejriwal

Related News

Bjp Ramachandra

CM Revanth : రేవంత్ ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది – రామచందర్ కీలక వ్యాఖ్యలు

CM Revanth : ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విషయానికొస్తే.. ఆయనపై నిరంతరం విమర్శలు చేయడం రేవంత్ అలవాటు చేసుకున్నారని రామచందర్ ఎద్దేవా చేశారు. రేవంత్ (CM Revanth) కు ఢిల్లీ వెళ్లి రావడమే సరిపోతుంది అని వ్యాఖ్యానించారు

    Latest News

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd