Delhi: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..సంఘటన స్థలంలో 16 ఫైరింజన్లు
ఢిల్లీ (Delhi)లోని కపషేరా ప్రాంతంలో అగ్నిప్రమాదం (Fire Breaks Out) జరిగింది. 16 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. సోనియా గాంధీ క్యాంపులోని ఓ గోడౌన్లో మంటలు చెలరేగాయి.
- Author : Gopichand
Date : 07-04-2023 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీ (Delhi)లోని కపషేరా ప్రాంతంలో అగ్నిప్రమాదం (Fire Breaks Out) జరిగింది. 16 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. సోనియా గాంధీ క్యాంపులోని ఓ గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా నివేదికలు లేవు. సమాచారం అందుకున్న వెంటనే 16 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని ఢిల్లీలోని అగ్నిమాపక శాఖ డివిజనల్ అధికారి సత్పాల్ భరద్వాజ్ తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన తెలిపారు.
#WATCH | Fire breaks out at a godown in Sonia Gandhi camp in Samalkha Kapashera area. 14 fire tenders have reached the spot, no casualties reported so far. pic.twitter.com/iMzbgoWxAG
— ANI (@ANI) April 6, 2023
ఢిల్లీలోని సమల్కా కపషేరా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కపషేరాలోని సోనియా గాంధీ క్యాంపులో ఉన్న కలప గోదాంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా గోదాం అంతటా మంటలు వ్యాపించాయి. గోదాంలో కలప పెద్ద సంఖ్యలో ఉండటంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. 16 ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
మరోవైపు.. బిజ్వాసన్ సమీపంలోని ఓ గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఇందులో ప్యాకింగ్, ప్యాకేజింగ్కు సంబంధించిన వస్తువులను ఉంచారు. మంటలు చెలరేగడంతో అగ్నిమాపక దళం వాహనాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడం ప్రారంభించాయి. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎటువంటి గాయం గురించి సమాచారం లేదు. ఎలాంటి నష్టం జరగలేదని స్థానిక స్టేషన్ ఇన్ఛార్జ్ సునీల్ తెలిపారు.ఈ ఘటన గురువారం రాత్రి 9:30 గంటలకు చోటు చేసుకుంది.