Delhi Deputy CM Manish Sisodia : కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర పన్నుతోంది..!!
- By hashtagu Published Date - 06:13 AM, Fri - 25 November 22
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. సిసోడియా ట్వీట్ చేస్తూ…ఎంసీడి, గుజరాత్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ, సీఎం అరవింద్ కేజ్రివాల్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతోందంటూ ఆరోపించారు. ఆప్ ,కేజ్రివాల్ గురించి బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేయడంతో సిసోడియా ఈ ప్రకటన చేశారు. కేజ్రివాల్ పై ఆప్ కార్యకర్తలు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారంటూ మనోజ్ తివారీ ట్వీట్ చేశారు.
తివారీ ట్వీట్ పై ఘాటుగా స్పందించారు సిసోడియా. సీఎం కేజ్రివాల్ పై దాడి చేయమని ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎంపి మనోజ్ తివారి తన గుండాలను బహిరంగంగా అడుగుతున్నారని..మండిపడ్డారు. కేజ్రివాల్ మర్డర్ కోసం ప్లాన్ వేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే సిసోడియా చేస్తున్న వాదనలు బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆప్ పూర్తిగా విసుగు చెందిందని, ప్రజల సానుభూతి కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తోందని పేర్కొంది.
अरविंद केजरीवाल जी की सुरक्षा को लेकर मैं चिंतित हुँ,क्योंकि लगातार भ्रष्टाचार,टिकिट बिक्री व जेल में बलात्कारी से दोस्ती व मसाज प्रकरण को लेकर AAP कार्यकर्ता व जनता ग़ुस्से में हैं।इनके MLA पिटे भी हैं। इसलिए दिल्ली के सीएम के साथ ऐसा ना हो.. सजा न्यायालय ही दे 🙏
— Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) November 24, 2022
బీజేపీ బెదిరింపులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఢిల్లీ, గుజరాత్ లో ఆప్ కు లభిస్తున్న మద్దతు చూసి బీజేపీ భయపడుతోంది.భారీ మెజార్టీతో ఆప్ గెలవడం ఖాయం. అందుకే కేజ్రివాల్ ను చంపేస్తామని బీజేపీ బెదిరిస్తోంది. ఇది ఢిల్లీ ప్రజలను , దేశాన్ని అమానించడమే. బీజేపీకి ఎంతవరకైనా తెగిస్తుందని సిసోడియా ఆరోపించారు.
गुजरात व MCD चुनाव मे हार के डर से बौखलाई BJP @ArvindKejriwal की हत्या की साजिश रच रही है
इनके सांसद मनोज तिवारी खुलेआम अपने गुंडो को अरविंद जी पर हमला करने के लिए कह रहे है और इसकी पूरी प्लानिंग कर ली है
AAP इनकी टुच्ची राजनीति से नही डरती,इनके गुंडागर्दी का जबाव अब जनता देगी
— Manish Sisodia (@msisodia) November 24, 2022
Related News
Delhi : ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ఎన్ బ్లాక్లో బ్యాగు కలకలం
Delhi: ఢిల్లీలోని ఐకానిక్ కన్నాట్ ప్లేస్లోని ఎన్ బ్లాక్లో శనివారం గుర్తుతెలియని వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగు కనుగొనబడింది. కన్నాట్ప్లేస్ ఏరియాలోని N బ్లాకులో ఎవరో వదిలేసి వెళ్లన బ్యాగు కనిపించడంతో అందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి జనాన్ని అప్రమత్తం చేశారు. ఘటనా స�