Ayodhya : అయోధ్య కు బయలుదేరుతున్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్
- By Sudheer Published Date - 10:12 AM, Sun - 21 January 24
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమానికి కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మోడీ (PM Modi) రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ వేడుకను చూసేందుకు దేశ నలుమూల నుండి పెద్ద ఎత్తున భక్తులు , రాజకీయ నేతలు , బిజినెస్ రంగ ప్రముఖులు , క్రీడాకారులు , సినీ తారలు ఇలా అన్ని రంగాల వారు భారీ సంఖ్యలో తరలివెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిధుల కోసం అన్ని ఏర్పాట్లు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక మరికాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు అయోధ్య కు బయలుదేరబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అయోధ్యకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేసి.. సోమవారం రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరవుతారు. ఇద్దరు నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతుండడంతో బీజేపీతో పొత్తులపై రాజకీయ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇక చంద్రబాబు అయోధ్య కు వెళ్తుండడంతో ఈనెల 25న కర్నూలు జిల్లా పత్తికొండలోజరగబోయే ‘రా కదలిరా’ కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 27 లేదా 28 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
మరోవైపు ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఓ భక్తుడు భారీ లడ్డూను అయోధ్యకు పంపించారు. సిటీలోని శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఓనర్ ఎన్ నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ లడ్డూ(Laddoo) ఇవాళ తెల్లవారుజామున అయోధ్యకు చేరుకుంది. సుమారు 1265 కేజీల బరువు ఉన్న ఆ లడ్డూ కరసేవక్పురంకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి కూడా లక్ష లడ్డూలను అయోధ్యకు చేరాయి.
Read Also : YSRCP : వైసీపీ ఐదో జాబితాపై కొనసాగుతున్న కసరత్తు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేతలు
Related News
Chandrababu : అమెరికాలో చంద్రబాబు.. ఆయన అడ్రస్ కోసం వెతుకుతున్న తెలుగువారు
ఉక్కపోతలో ఎన్నికల ప్రచార షెడ్యూల్లలో పాల్గొని, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పూర్తి కావడంతో, అన్ని రాజకీయ నేతల నాయకులు తమ తీవ్రమైన షెడ్యూల్ల నుండి చాలా అవసరమైన విరామం తీసుకున్నారు.