Eklavya Model Schools: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వచ్చే మూడేళ్లలో 38,800 ఉద్యోగాలు భర్తీ..!
టీచర్ రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Eklavya Model Schools)లో ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని నియమించబోతోంది.
- Author : Gopichand
Date : 15-06-2023 - 9:42 IST
Published By : Hashtagu Telugu Desk
Eklavya Model Schools: టీచర్ రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Eklavya Model Schools)లో ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని నియమించబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఓ కార్యక్రమంలో ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని ఎమ్మార్ఎస్కు కేంద్ర ప్రభుత్వం నియమించనుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా గిరిజన విద్యార్థుల కోసం మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను రూపొందించడానికి 1997-98లో EMRS పథకం ప్రారంభించబడింది. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో ఇటువంటి పాఠశాలల సంఖ్య 2013-14లో 119 ఉండగా 2023-24 నాటికి 401కి పెరిగింది. దీంతోపాటు పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది.
Also Read: Cyclone Biparjoy: బిపార్జోయ్ తుఫాను.. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
2023-2014 సంవత్సరంలో ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 34365. ఇది 2023-24లో 1,13,275కి పెరిగింది. 2019లో రూపొందించిన కొత్త పథకంలో భాగంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ ST జనాభా, కనీసం 20,000 మంది గిరిజన వ్యక్తులు ఉన్న ప్రతి బ్లాక్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అదే సమయంలో దీనికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ విషయంలో ప్రకటించారు. రానున్న మూడేళ్లలో ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం చేపడతామని ఐదో బడ్జెట్ సందర్భంగా ఆయన చెప్పారు. దీని కింద 740 ఏకలవ్య పాఠశాలలకు 38 వేల 800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని నియమించనున్నారు.