apple : కేంద్రం వార్నింగ్.. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ యూజర్లకు ‘హై రిస్క్’
- By Latha Suma Published Date - 03:08 PM, Wed - 3 April 24

apple: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్ ఇన్) తాజాగా భారత్(India) లోని యాపిల్ ఉత్పత్తుల(Apple products) యూజర్లకు(users) భారీ సెక్యూరిటీ వార్నింగ్ జారీ చేసింది. యాపిల్ డివైస్లలో ‘రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వల్నరబులిటీ’ని గుర్తించామని.. ఇది యూజర్ల డివైస్లు హ్యాకర్ల బారిన పడేందుకు దారితీయొచ్చని హెచ్చరించింది. దీనివల్ల హ్యాకర్లు యాపిల్ డివైస్లలోకి రిమోట్ యాక్సెస్ ద్వారా చొరబడి నిర్దేశిత లక్ష్యంపై ‘ఆర్బిట్రరీ కోడ్’ను అమలు చేసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. సాఫ్ట్ వేర్ లోని భద్రతా లోపం యాపిల్ డివైస్ ల యూజర్లను హ్యాకర్లు ఓ ప్రత్యేక లింక్ లోకి వెళ్లేలా బురిడీ కొట్టించవచ్చని.. తద్వారా రిమోట్ పద్ధతిలో డివైస్ పై దాడి చేసేందుకు అవకాశం హ్యాకర్లకు లభించొచ్చని సెర్ట్ ఇన్ తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.