Ban On FDC Drugs: 14 మందులపై నిషేధం విధించిన కేంద్రం.. అందులో పారాసెటమాల్ కూడా..!
సత్వర ఉపశమనం కలిగించే ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (Ban On FDC Drugs) మందులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
- By Gopichand Published Date - 07:49 AM, Sun - 4 June 23
Ban On FDC Drugs: సత్వర ఉపశమనం కలిగించే ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (Ban On FDC Drugs) మందులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిలో పారాసెటమాల్, నిమెసులైడ్ వంటి విస్తృతంగా అమ్ముడైన మందులు ఉన్నాయి. ఈ మందులు త్వరిత ఉపశమనాన్ని ఇస్తాయి కానీ అవి హాని కలిగించే ప్రమాదం ఉంది. నిపుణుల కమిటీ అభిప్రాయం మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మందులను నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల సలహా కమిటీ గతేడాది ఏప్రిల్లో తన నివేదికను సమర్పించింది. ఈ మందులకు వైద్యపరంగా ఎలాంటి సమర్థన లేదని చెప్పారు. నిషేధించబడిన మందులు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
నిషేధించబడిన మందుల వివరాలు
నిమెసులైడ్ + పారాసెటమాల్
క్లోర్ఫెనిరమైన్ + కోడైన్ సిరప్
ఫోల్కోడిన్ + ప్రోమెథాజైన్
అమోక్సిసిలిన్ + బ్రోమ్హెక్సిన్
Bromhexine + Dextromethorphan + అమ్మోనియం క్లోరైడ్ మెంథాల్
పారాసెటమాల్ + బ్రోమ్హెక్సిన్ ఫెనైల్ఫ్రైన్ + క్లోర్ఫెనిరమైన్ + గుయిఫెనెసిన్
సాల్బుటమాల్ + క్లోర్ఫెనిరమైన్
Also Read: Kabirdas -Social Reformer : మూఢనమ్మకాలపై యుద్ధం చేసిన కబీర్ దాస్
ప్రమాదకరమైన మందులు
నిపుణుల కమిటీ తన సలహాలో ఎఫ్డిసి మందులకు ఎటువంటి వైద్యపరమైన సమర్థన లేదని, అవి మానవులకు ప్రమాదకరమని పేర్కొంది. అందువల్ల పెద్ద ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 14 FDCల తయారీ, అమ్మకం లేదా పంపిణీని నిషేధించడం అవసరం. 940 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ 26A ప్రకారం ఈ నిషేధం విధించబడింది.
FDC మందులు అంటే ఏమిటి..?
FDC ఔషధాలను అంటారు. వీటిని రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను కలపడం ద్వారా తయారు చేస్తారు. వీటిని కాక్టెయిల్ మందులు అని కూడా అంటారు. 2016లో సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన నిపుణుల బృందం శాస్త్రీయ సమాచారం లేకుండానే ఈ మందులను రోగులకు విక్రయిస్తున్నట్లు పేర్కొంది. ఆ సమయంలో ప్రభుత్వం 344 డ్రగ్ కాంబినేషన్ల తయారీ, విక్రయం, పంపిణీపై నిషేధం విధించింది. ఇప్పుడు నిషేధించబడిన మందులు ఈ కలయికలో భాగమే.
Related News
Health: భయపెడుతున్న బీపీ.. అనారోగ్యానికి అసలు కారణమిదే
Health: రక్త పోటు బాధితుల సంఖ్య పెరుగుతుంది. బీపీతో బాధపడే వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఇటీవల కన్జ్యూమర్ వాయిస్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా హెచ్చరించింది. భారత వైద్య పరిశోధనా మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. పంజాబ్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్ సర్వేలో ఈ విషయం వెల్లడయింది. ప్రపంచవ్�