HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Central Government Is Planning To Conduct A Nationwide Census After The Lok Sabha Elections

Population Census : జనగణనకు భారత్ రెడీ.. ఏమేం చేస్తారో తెలుసా ?

Population Census : మనదేశంలో చివరిసారిగా 2011లో జనగణన నిర్వహించారు.

  • By Pasha Published Date - 10:45 AM, Fri - 15 March 24
  • daily-hunt
Population Census
Population Census

Population Census : మనదేశంలో చివరిసారిగా 2011లో జనగణన నిర్వహించారు. కనీసం ప్రతీ పదేళ్లకోసారి జనగణన నిర్వహించడం ప్రామాణికం.  అయితే 2021లో మళ్లీ చేపట్టాల్సిన జనాభా లెక్కలు..  కరోనా తదితర కారణాలతో వాయిదాపడ్డాయి. అయితే అదే టైంలో ప్రజలు ఇళ్లలో ఉండటాన్ని అనుకూలంగా భావించి.. అమెరికా, రష్యా, యూకే, బ్రెజిల్‌, చైనా, బంగ్లాదేశ్‌ వంటి దేశాలు జనాభా లెక్కల కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్‌గా నిర్వహించాయి. కానీ మనం మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేకపోయాం. ఇక ఈసారి  జనగణనకు భారత సర్కారు గట్టి ముహూర్తాన్ని ఖరారు చేయనుందని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మనదేశంలో జనగణన జరుగుతుందని సమాచారం. అందులో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్లోనూ జనగణన కార్యక్రమం నిర్వహణకు నిధులు కూడా కేటాయించారు. జనాభా లెక్కల సేకరణ కోసం దేశంలో దాదాపు 3లక్షల మంది ప్రభుత్వ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.  12నెలలపాటు జనగణన(Population Census) ప్రక్రియ కొనసాగుతుందని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

  • మన దేశంలో తొలిసారిగా బ్రిటీష్ హయాంలో 1881లో జనగణనను నిర్వహించారు.
  • అప్పటినుంచి ప్రతి పదేళ్లకోసారి జనగణన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
  • రెండు ప్రపంచ యుద్ధాలు.. చైనా, పాకిస్థాన్లతో యుద్ధాలు జరిగిన టైంలో కూడా మన దేశంలో జనాభా లెక్కల సేకరణ ఆగలేదు.
  • 2011లో చివరిసారి జనగణన నిర్వహించారు.
  • జనగణన చట్టం ప్రకారం చేపట్టే ఈ ప్రక్రియ వల్ల పదేళ్లలో దేశ జనాభా ఎంతమేర పెరిగిందో తెలుస్తుంది.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన సమాచారమే ఆధారంగా నిలుస్తుంది.

Also Read : WhatsApp : వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లను ఇక స్క్రీన్ షాట్ తీయలేరు

  • 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం.. ఇప్పటికీ రేషన్‌ కార్డులు జారీ కాకపోవడం వల్ల కనీసం 10 కోట్ల మంది అర్హులకు సంక్షేమ పథకాలు అందట్లేదు అని విశ్లేషకులు చెబుతున్నారు.
  • ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ పథకాల రూపకల్పనకు 2011 నాటి జనగణన లెక్కలనే ఆధారంగా తీసుకుంటున్నాయి. దీనివల్ల పెరిగిపోయిన జనసంఖ్యకు  అనుగుణంగా నిధుల కేటాయింపు జరగట్లేదు.
  • గత తొమ్మిదేళ్ల వ్యవధిలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్న ఇటీవల  నీతి ఆయోగ్‌ ఇచ్చిన నివేదికపై విమర్శలు వెల్లువెత్తాయి. సరైన జనగణన సమాచారం లేకుండా పేదరికాన్ని ఎలా మదింపు  చేశారనే ప్రశ్నలు తలెత్తాయి.
  • ఈసారి కులాల ఆధారంగా జనాభాను లెక్కించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
  • గతేడాది ఏప్రిల్‌లో జనాభాపరంగా చైనాను భారత్ అధిగమించింది. దీంతో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ ఆవిర్భవించింది. దీనిపై ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటన చేసింది. ప్రస్తుతం మన దేశ జనాభా 140 కోట్లకు పైమాటే.

Also Read :CM Revanth Reddy : సంచలనంగా మారిన రేవంత్ ఫోన్ ట్యాపింగ్..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central government
  • india
  • Lok Sabha Elections
  • Nationwide Census
  • population census

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

  • H1b Visa

    H-1B వీసాపై మరిన్ని కఠిన నిబంధనలకు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్.!

Latest News

  • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

  • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

  • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

  • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

  • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd