HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >By April 22 More Smart Cities Will Be Ready In The Country

Smart Cities: ఏప్రిల్ నాటికి దేశంలో మరో 22 స్మార్ట్ సిటీలు రెడీ

భారతదేశంలో మరో 22 స్మార్ట్ సిటీలు ఏప్రిల్ నాటికి సిద్ధం కానున్నాయి.కేంద్ర ప్రభుత్వ జాతీయ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఈ నగరాలను డెవలప్ చేశారు.

  • Author : Maheswara Rao Nadella Date : 13-03-2023 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
By April, 22 More Smart Cities Will Be Ready In The Country
By April, 22 More Smart Cities Will Be Ready In The Country

భారతదేశంలో మరో 22 స్మార్ట్ సిటీలు (Smart Cities) ఏప్రిల్ నాటికి సిద్ధం కానున్నాయి.కేంద్ర ప్రభుత్వ జాతీయ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఈ నగరాలను డెవలప్ చేశారు. ఆయా నగరాల అభివృద్ధికి అవసరమైన అన్ని ప్రాజెక్ట్‌లను ఏప్రిల్ నాటికి పూర్తి అవుతాయి. జాతీయ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద నామినేట్ చేయబడిన మిగిలిన 78 నగరాలు కూడా రాబోయే నాలుగు నెలల్లో రెడీ అవుతాయి. రాబోయే కొన్ని నెలల్లో వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీస్ అభివృద్ధి ప్రాజెక్టులలో కేంద్ర ప్రభుత్వం వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది.

ఏమిటీ మిషన్?

నేషనల్ స్మార్ట్ సిటీస్ (Smart Cities) మిషన్ 2015 జూన్ లో ప్రారంభించబడింది. దీని కింద 2016 మరియు 2018 మధ్య నాలుగు స్థాయిల పోటీ ద్వారా 100 నగరాలు ఎంపిక చేయబడ్డాయి.ఈ మిషన్ కింద ఒక్కో స్మార్ట్ సిటీకి ఏటా రూ.100 కోట్లు ఇస్తానని కేంద్రం ప్రకటించింది. ఐదేళ్లలో రూ. 48,000 కోట్లు ఈ మిషన్ పై ఖర్చు చేస్తామని వెల్లడించింది.

ఏప్రిల్ నాటికి సిద్ధం కానున్న స్మార్ట్ సిటీల (Smart Cities) వివరాలు

ఆగ్రా , అహ్మదాబాద్ , అమరావతి, భోపాల్ , భువనేశ్వర్, చెన్నై , కోయంబత్తూర్, ఈరోడ్, ఇండోర్, కాకినాడ, మదురై, పింప్రి-చించ్వాడ్, పూణే , రాంచీ, సేలం, సూరత్ నగరాలు ఏప్రిల్ నాటికి స్మార్ట్ సిటీస్ గా మారనున్నాయి.తంజావూరు, తిరుచిరాపల్లి, ఉదయపూర్,  వారణాసి , వెల్లూరు,  విశాఖపట్నం నగరాల్లో ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయి. అవి పూర్తి కాగానే ఏప్రిల్ నాటికి 22 స్మార్ట్ సిటీలను పూర్తి చేయనున్నారు. ఈ మిషన్ కింద ఎంపిక చేసిన మిగిలిన 78 నగరాలలో కూడా పెండింగ్‌ పనులు వచ్చే మూడు, నాలుగు నెలల్లో పూర్తి కానున్నాయి.

రూ. 98,796 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి

దేశంలో స్మార్ట్ సిటీస్ మిషన్ కింద జనవరి 27 నాటికి రూ.98,796 కోట్లు విలువైన 5246 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.1,81,322 కోట్ల విలువైన పనులను మరో 100 నగరాల్లో చేసేందుకు ఆర్డర్లు జారీ చేశారు.  ఈ మిషన్ కోసం కేంద్రం విడుదల చేసిన రూ. 36,447 కోట్లులో 88% (రూ. 32,095 కోట్లు) వినియోగించారు.

ఆగ్రా, వారణాసి ముందంజలో

2019 సంవత్సరం నుంచి ఉత్తర ప్రదేశ్‌లో 10 స్మార్ట్ సిటీల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.5,000 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఈ మిషన్ లో
వారణాసి,ఆగ్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవి ఇప్పటికే 85% లక్ష్యాలను పూర్తి చేశాయి. మిగిలిన నగరాలు కూడా తమ కొనసాగుతున్న ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నాయి.

Also Read:  Final Test: అహ్మదాబాద్ టెస్ట్ డ్రా.. సిరీస్ భారత్ కైవసం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • April
  • country
  • india
  • Mission
  • narendra modi
  • pm modi
  • Ready
  • Smart Cities

Related News

PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

PM Modi : ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రధాని సోషల్ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. చంద్రబాబును మంచి మిత్రుడని, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసు

  • PM Modi

    Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

  • PM Modi

    12 ఏళ్ల‌లో తొలిసారి.. అసంతృప్తి వ్య‌క్తం చేసిన పీఎం మోదీ!

  • Lok Sabha Seats

    లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

  • President Donald Trump congratulated Taranjit Singh Sandhu on becoming the new Lieutenant Governor of Delhi

    Donald Trump: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd