HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >By April 22 More Smart Cities Will Be Ready In The Country

Smart Cities: ఏప్రిల్ నాటికి దేశంలో మరో 22 స్మార్ట్ సిటీలు రెడీ

భారతదేశంలో మరో 22 స్మార్ట్ సిటీలు ఏప్రిల్ నాటికి సిద్ధం కానున్నాయి.కేంద్ర ప్రభుత్వ జాతీయ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఈ నగరాలను డెవలప్ చేశారు.

  • By Maheswara Rao Nadella Published Date - 08:00 PM, Mon - 13 March 23
  • daily-hunt
By April, 22 More Smart Cities Will Be Ready In The Country
By April, 22 More Smart Cities Will Be Ready In The Country

భారతదేశంలో మరో 22 స్మార్ట్ సిటీలు (Smart Cities) ఏప్రిల్ నాటికి సిద్ధం కానున్నాయి.కేంద్ర ప్రభుత్వ జాతీయ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఈ నగరాలను డెవలప్ చేశారు. ఆయా నగరాల అభివృద్ధికి అవసరమైన అన్ని ప్రాజెక్ట్‌లను ఏప్రిల్ నాటికి పూర్తి అవుతాయి. జాతీయ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద నామినేట్ చేయబడిన మిగిలిన 78 నగరాలు కూడా రాబోయే నాలుగు నెలల్లో రెడీ అవుతాయి. రాబోయే కొన్ని నెలల్లో వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీస్ అభివృద్ధి ప్రాజెక్టులలో కేంద్ర ప్రభుత్వం వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది.

ఏమిటీ మిషన్?

నేషనల్ స్మార్ట్ సిటీస్ (Smart Cities) మిషన్ 2015 జూన్ లో ప్రారంభించబడింది. దీని కింద 2016 మరియు 2018 మధ్య నాలుగు స్థాయిల పోటీ ద్వారా 100 నగరాలు ఎంపిక చేయబడ్డాయి.ఈ మిషన్ కింద ఒక్కో స్మార్ట్ సిటీకి ఏటా రూ.100 కోట్లు ఇస్తానని కేంద్రం ప్రకటించింది. ఐదేళ్లలో రూ. 48,000 కోట్లు ఈ మిషన్ పై ఖర్చు చేస్తామని వెల్లడించింది.

ఏప్రిల్ నాటికి సిద్ధం కానున్న స్మార్ట్ సిటీల (Smart Cities) వివరాలు

ఆగ్రా , అహ్మదాబాద్ , అమరావతి, భోపాల్ , భువనేశ్వర్, చెన్నై , కోయంబత్తూర్, ఈరోడ్, ఇండోర్, కాకినాడ, మదురై, పింప్రి-చించ్వాడ్, పూణే , రాంచీ, సేలం, సూరత్ నగరాలు ఏప్రిల్ నాటికి స్మార్ట్ సిటీస్ గా మారనున్నాయి.తంజావూరు, తిరుచిరాపల్లి, ఉదయపూర్,  వారణాసి , వెల్లూరు,  విశాఖపట్నం నగరాల్లో ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయి. అవి పూర్తి కాగానే ఏప్రిల్ నాటికి 22 స్మార్ట్ సిటీలను పూర్తి చేయనున్నారు. ఈ మిషన్ కింద ఎంపిక చేసిన మిగిలిన 78 నగరాలలో కూడా పెండింగ్‌ పనులు వచ్చే మూడు, నాలుగు నెలల్లో పూర్తి కానున్నాయి.

రూ. 98,796 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి

దేశంలో స్మార్ట్ సిటీస్ మిషన్ కింద జనవరి 27 నాటికి రూ.98,796 కోట్లు విలువైన 5246 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.1,81,322 కోట్ల విలువైన పనులను మరో 100 నగరాల్లో చేసేందుకు ఆర్డర్లు జారీ చేశారు.  ఈ మిషన్ కోసం కేంద్రం విడుదల చేసిన రూ. 36,447 కోట్లులో 88% (రూ. 32,095 కోట్లు) వినియోగించారు.

ఆగ్రా, వారణాసి ముందంజలో

2019 సంవత్సరం నుంచి ఉత్తర ప్రదేశ్‌లో 10 స్మార్ట్ సిటీల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.5,000 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఈ మిషన్ లో
వారణాసి,ఆగ్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవి ఇప్పటికే 85% లక్ష్యాలను పూర్తి చేశాయి. మిగిలిన నగరాలు కూడా తమ కొనసాగుతున్న ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నాయి.

Also Read:  Final Test: అహ్మదాబాద్ టెస్ట్ డ్రా.. సిరీస్ భారత్ కైవసం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • April
  • country
  • india
  • Mission
  • narendra modi
  • pm modi
  • Ready
  • Smart Cities

Related News

Rare Earths Scheme

Rare Earths Scheme: చైనా ఆంక్షల మధ్య భారత్ కీలక నిర్ణయం.. రూ. 7,280 కోట్లతో!

భారతదేశంలో ఈ అయస్కాంతాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 2025తో పోలిస్తే 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ప్రస్తుతం భారతదేశ అవసరాలు ఎక్కువగా దిగుమతుల ద్వారా తీర్చబడుతున్నాయి.

  • Virat Kohli

    Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్

  • Ram Temple

    Ram Temple: ఇది మీకు తెలుసా? అయోధ్య రామమందిరంలో 45 కిలోల బంగారం వినియోగం!

  • Nepal Currency

    Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?

  • Dhwajarohan In Ayodhya

    Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!

Latest News

  • Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్!

  • Indian Constitution: భారత రాజ్యాంగం.. డా. అంబేద్కర్ ఒక్కరే రాశారా?

  • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చ‌నిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!

  • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

  • World Largest City: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద నగరం ఏదో తెలుసా?!

Trending News

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd