Boycott NITI Aayog : CMల డుమ్మాపై వేడెక్కిన ఢిల్లీ పాలిటిక్స్
నీతి అయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు డుమ్మా( Boycott NITI Aayog) కొట్టారు. గైర్హాజరుపై బీజేపీ రాజకీయ కోణాన్ని తీస్తోంది.
- By CS Rao Published Date - 05:09 PM, Sat - 27 May 23
నీతి అయోగ్ పాలక మండలి సమావేశానికి ఎనిమిది మంది ముఖ్యమంత్రులు డుమ్మా( Boycott NITI Aayog) కొట్టారు. వాళ్ల గైర్హాజరుపై బీజేపీ రాజకీయ కోణాన్ని తీస్తోంది. ప్రజా స్వామ్యంపై ఏ మాత్రం బాధ్యతలేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడుతోంది. భారత దేశాన్ని విజన్ 2047 దిశగా తీసుకెళ్లడానికి 100 అంశాలపై నీతి ఆయోగ్ చర్చకు పెట్టింది. ఇలాంటి ముఖ్యమైన సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బెంగాల్ సీఎం మమత, రాజస్తాన్ సీఎం గెహ్లాట్, కేరళ సీఎం విజయన్, కర్ణాటక, తమిళనాడు సీఎంలు సిద్ధిరామయ్య, స్టాలిన్ తదితరులు హాజరు కాలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సఖ్యతగా లేదనడానికి ఇదో నిదర్శనమని శివసేన అధినేత ఉద్ధవ్ ఆరోపిస్తున్నారు.
నీతి అయోగ్ పాలక మండలి సమావేశానికి 8 మంది ముఖ్యమంత్రులు డుమ్మా( Boycott NITI Aayog)
కేంద్ర, రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి. ఫెడరల్ వ్యవస్థలో కలిసిమెలిసి పనిచేయాలి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కానీ, అలాంటి పరిస్థితిని కేంద్రం కాలరాస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఉండేలా మోడీ సర్కార్ చేస్తోందని (Boycott NITI Aayog)మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఆర్డర్ ను కూడా కాదని గవర్నర్ జనరల్ కు ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను అప్పగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం ఎమర్జెన్సీని తలపిస్తోందని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో కలిసి పనిచేయలేని పరిస్థితి తీసుకొచ్చారని హైదరాబాద్ లో భేటీ అయిన పంజాబ్, ఢిల్లీ, తెలంగాణ సీఎంలు ఆరోపించారు.
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కూడా 19పార్టీలు రావడంలేదు
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని బహిష్కరించిన (Boycott NITI Aayog)ముఖ్యమంత్రులపై బిజెపి శనివారం విరుచుకుపడింది, వారి నిర్ణయం “ప్రజలకు వ్యతిరేకం” మరియు “బాధ్యతారహితమైనది” అని పేర్కొంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా పలు అంశాలపై చర్చించే సమావేశం శనివారం ఇక్కడ ప్రారంభమైంది. విలేఖరుల సమావేశంలో బిజెపి సీనియర్ నాయకుడు మరియు కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి మొత్తం లక్ష్యం, ఫ్రేమ్వర్క్ మరియు రోడ్ మ్యాప్ను నిర్ణయించడానికి నీతి ఆయోగ్ కీలకమైన సంస్థ అని అన్నారు.
Also Read : Modi Graph : 9ఏళ్లలో లేచిపడిన మోడీ గ్రాఫ్
నీతి ఆయోగ్ ఎనిమిదో పాలక మండలి సమావేశంలో 100 అంశాలపై చర్చించాలని ప్రతిపాదించామని, అయితే ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకావడం( Boycott NITI Aayog)లేదని ఆయన అన్నారు. 100 అంశాలపై చర్చించాల్సిన సభకు ఎందుకు రావడం లేదని.. ఇంత పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రులు పాల్గొనకపోతే తమ రాష్ట్రాల వాణిని తీసుకురావడం లేదని ప్రసాద్ అన్నారు. ఇది చాలా దురదృష్టకరం, బాధ్యతారాహిత్యం మరియు ప్రజా వ్యతిరేకం అని ఆయన అన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించడంలో మీరు ఎంత వరకు వెళ్తారు’ అని బీజేపీ నేత ప్రశ్నించారు. “మోదీని ఎదిరించేందుకు మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి. కానీ మీ రాష్ట్ర ప్రజలకు ఎందుకు నష్టం కలిగిస్తున్నారు?” అని ప్రశ్నించాడు. ఎనిమిది మంది ముఖ్యమంత్రులు సమావేశాన్ని బహిష్కరించే ఈ నిర్ణయం “పూర్తిగా బాధ్యతారాహిత్యం” మరియు “ప్రజా ప్రయోజనాలకు మరియు వారి రాష్ట్రాలలో వారు పాలించే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధం” అని ప్రసాద్ అన్నారు.
ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడం విపక్షాల ఐక్యతకు
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కూడా 19పార్టీలు రావడంలేదు. ఇప్పటికే మోడీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ విపక్షాలు ప్రకటన జారీ చేయడం జరిగింది. ఇటీవల వరకు విపక్షాల అనైక్యత కారణంగా బీజేపీ బలంగా ఉన్నట్టు కనిపించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు పడినప్పటి నుంచి విపక్షాలు ఒకచోటకు రావడం ప్రారంభించాయి. అందుకు ఒక్కో అంశం కలిసి వస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కలిసిరావడంతో దేశ రాజకీయం మారిపోతోంది. ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడం విపక్షాల ఐక్యతకు మరో వేదికగా కనిపిస్తోంది. ఇక పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడాన్ని విపక్షాలు నిలదీస్తున్నారు. ఆదివాసీ గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్నందునే ఆహ్వానం అందించలేదని విమర్శలు గుప్పిస్తూ ఓట్ల రాజకీయానికి విపక్షాలు తెరలేపాయి. మొత్తం మీద విపక్షాల ఐక్యత పెరుగుతూ మోడీ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకు నిదర్శనమే శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ఎనిమిది మంది సీఎంల డుమ్మా (Boycott NITI Aayog)కొట్టడం.
Also Read : Threaten To Murder PM Modi : ప్రధాని మోడీని చంపేస్తానని కాల్.. చేసింది ఎవరంటే ?
Related News
TDP MLA Candidate : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో గుంతలరోడ్ల మరమత్తుకు శ్రీకారం..!
TDP MLA Candidate ఎమ్మెల్యే అయ్యాక కాదు గెలవక ముందే ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపడుతున్నారు టీడీపీ నేత అమిలినేని సురేంద్ర బాబు. ఆయన నియోజకవర్గంలో ఉన్న గుంతల రోడ్లు మరమత్తులు