Threaten To Murder PM Modi : ప్రధాని మోడీని చంపేస్తానని కాల్.. చేసింది ఎవరంటే ?
అతడి పేరు హేమంత్.. వయసు 48 సంవత్సరాలు.. ఢిల్లీలోని రాయ్గర్ పురా వాస్తవ్యుడు.. మద్యం మత్తులో గురువారం రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్ కు (PCR) ఫోన్ చేశాడు. ప్రధాని మోడీని చంపుతానని (Threaten To Murder PM Modi) వార్నింగ్ ఇచ్చాడు.
- Author : Pasha
Date : 26-05-2023 - 10:33 IST
Published By : Hashtagu Telugu Desk
అతడి పేరు హేమంత్.. వయసు 48 సంవత్సరాలు.. ఢిల్లీలోని రాయ్గర్ పురా వాస్తవ్యుడు.. మద్యం మత్తులో గురువారం రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్ కు (PCR) ఫోన్ చేశాడు. ప్రధాని మోడీని చంపుతానని (Threaten To Murder PM Modi) వార్నింగ్ ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ కాల్ ను ట్రేస్ చేసి.. కరోల్ బాగ్లో హేమంత్ ను అరెస్టు చేసింది.
Also read : Modi Award : ప్రధాని మోడీకి 2 దేశాల అత్యున్నత పురస్కారాలు
నిందితుడు గత 6 సంవత్సరాలుగా నిరుద్యోగి అని, అతనికి మద్యపానం అలవాటు ఉందని పోలీసులు వెల్లడించారు. ఉద్యోగం లేకపోవడం వల్లే మద్యానికి బానిసగా మారాడని చెప్పారు.జాబ్ లేదనే కోపంలో ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానంటూ(Threaten To Murder PM Modi) కాల్ చేశాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.