HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bjp Shinde Sena Ncp Agrees Over Maharashtra Lok Sabha Seats Sharing

Maharashtra : మహారాష్ట్రలో బీజేపీ కూటమి సీట్ల పంపకాలు ఇలా..

మహారాష్ట్రలో గత ఏడాది వ్యవధిలో రెండు పార్టీలు ముక్కలయ్యాయి.  శివసేన పార్టీ శివసేన (ఏక్‌నాథ్ షిండే), శివసేన (ఉద్ధవ్) అనే వర్గాలుగా చీలిపోయిన సంగతి మనకు తెలిసిందే. శివసేన పేరు, గుర్తులు ఏక్‌నాథ్ షిండే వర్గం వద్దే ఉన్నాయి. వీటిలో  శివసేన (ఏక్‌నాథ్ షిండే) వర్గం మహారాష్ట్రలోని(Maharashtra)  బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.

  • By Pasha Published Date - 11:48 AM, Wed - 6 March 24
  • daily-hunt
Maharashtra
Maharashtra

Maharashtra : మహారాష్ట్రలో గత ఏడాది వ్యవధిలో రెండు పార్టీలు ముక్కలయ్యాయి.  శివసేన పార్టీ శివసేన (ఏక్‌నాథ్ షిండే), శివసేన (ఉద్ధవ్) అనే వర్గాలుగా చీలిపోయిన సంగతి మనకు తెలిసిందే. శివసేన పేరు, గుర్తులు ఏక్‌నాథ్ షిండే వర్గం వద్దే ఉన్నాయి. వీటిలో  శివసేన (ఏక్‌నాథ్ షిండే) వర్గం మహారాష్ట్రలోని(Maharashtra)  బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర సీఎంగా శివసేన (ఏక్‌నాథ్ షిండే) వర్గం అధినేత ఏక్‌నాథ్ షిండే ఉన్నారు. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ చేతికొచ్చింది. ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఉన్నారు. ఈ రెండు పార్టీలకు కీలక పదవులు ఇచ్చిన బీజేపీ ఎట్టకేలకు వాటితో సీట్ల సర్దుబాటు ఫార్ములాపై ఒక నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 48 లోక్‌సభ సీట్లకుగానూ బీజేపీ 32 స్థానాల్లో పోటీ చేయనుంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 12, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 3 నుంచి నాలుగు లోక్‌సభ సీట్లను కేటాయించినట్టు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join

మంగళవారం అర్ధరాత్రి మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై చర్చించగా, ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. 2019 ఎన్నికల్లో శివసేన 23 సీట్లు గెల్చుకుంది. అయితే ఇప్పుడు కూడా 23 సెగ్మెంట్లు తమకే కేటాయించాలని షిండే వర్గం పట్టుబట్టింది. అయితే 12 మాత్రమే ఇస్తామని అమిత్‌షా తేల్చి చెప్పారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ 10సీట్లు డిమాండ్ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ నాలుగు సీట్లే గెలిచింది. దీంతో ఈసారి కూడా నాలుగే సీట్లు ఇస్తామని అమిత్‌షా చెప్పారు.శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసిన తర్వాత ప్రస్తుతం ఒక ఎంపీ మాత్రమే అజిత్‌ పవార్ వెంట ఉన్నారు. మార్చి 2వ తేదీన లోక్‌సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. అందులో మహారాష్ట్ర టికెట్ల వివరాలు లేవు. ఇప్పుడు సీట్ల పంపకాలపై క్లారిటీ రావడంతో త్వరలోనే  మహారాష్ట్ర అభ్యర్థులను కూడా బీజేపీ ఖరారు చేయనుంది.

Also Read :Shortest Doctor : 3 అడుగుల డాక్టర్​.. న్యాయపోరాటంతో ‘వరల్డ్ రికార్డ్’ విజయం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Lok Sabha Seats Sharing
  • Maharashtra
  • ncp
  • Shinde Sena

Related News

Bjp Ramachandra

CM Revanth : రేవంత్ ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది – రామచందర్ కీలక వ్యాఖ్యలు

CM Revanth : ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విషయానికొస్తే.. ఆయనపై నిరంతరం విమర్శలు చేయడం రేవంత్ అలవాటు చేసుకున్నారని రామచందర్ ఎద్దేవా చేశారు. రేవంత్ (CM Revanth) కు ఢిల్లీ వెళ్లి రావడమే సరిపోతుంది అని వ్యాఖ్యానించారు

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd