Karnataka Elections: కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన నడ్డా
కర్ణాటకలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి
- By Praveen Aluthuru Published Date - 12:48 PM, Mon - 1 May 23

Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా మేనిఫెస్టోపై ఫోకస్ చేస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోను ఈ రోజు విడుదల చేసింది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం బీజేపీ మేనిఫెస్టోలో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా సిలిండర్లు ఇస్తామని పార్టీ ప్రకటించింది. బీజేపీ మేనిఫెస్టో ‘విజన్ డాక్యుమెంట్’ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు బెంగళూరులో విడుదల చేశారు. మేనిఫెస్టోను విడుదల చేస్తూ నడ్డా మాట్లాడుతూ.. ఈ మేనిఫెస్టో ఏసీలో కూర్చుని తయారు చేయలేదని, రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాన్ని సందర్శించి లక్షలాది మంది ప్రజల సూచనలు సలహాలు తీసుకుని మేనిఫెస్టో రూపొందించామని నడ్డా అన్నారు.
బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు*
- కర్ణాటకలో యూనిఫాం సివిల్ కోడ్ను బీజేపీ తీసుకురానుంది
- బిపిఎల్ కుటుంబాలకు 3 ఉచిత సిలిండర్లు, రోజుకు అరలీటర్ పాలు ఇస్తామని హామీ ఇచ్చారు
- అటల్ డైట్ సెంటర్ను ఏర్పాటు చేయడం ద్వారా తక్కువ ధరకే ఆహారం అందిస్తామని ప్రకటించారు.
- ఉమ్మడి పౌర స్మృతి అమలు
- రైతులకు రూ.5 లక్షల వరకు సున్నా వడ్డీకే రుణాలు
- కర్ణాటకలో ఎన్ఆర్సీ (జాతీయ పౌరుల రిజిస్టర్) అమలు
- రాడికలైజేషన్కు వ్యతిరేకంగా పోరాటం
- ఛాందసవాదానికి వ్యతిరేకంగా ప్రత్యేక విభాగం ఏర్పాటు
- బెంగళూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- బెంగళూరులోని అపార్ట్మెంట్వాసులు ఆనందంగా జీవించడం కోసం ప్రత్యేక పథకం
- కర్ణాటక అపార్ట్మెంట్ ఓనర్షిప్ యాక్ట్, 1972 సవరణ, కర్ణాటక రెసిడెంట్స్ వెల్ఫేర్ కన్సల్టేటివ్ కమిటీ ఏర్పాటు
- పోషణ పథకం క్రింద నిరుపేద కుటుంబాలకు ప్రతి రోజూ ఉచితంగా అర లీటరు చొప్పున నందిని పాల పంపిణీ
- ప్రతి నెలా రేషన్ కిట్స్.. 5 కేజీల శ్రీ అన్న-సిరి ధాన్య పంపిణీ
- చట్టవిరుద్ధ వలసదారులను పంపించేయడం
- ప్రతి పురపాలక సంఘంలోని ప్రతి వార్డులోనూ అటల్ ఆహార కేంద్రాల ఏర్పాటు, నాణ్యమైన, ఆరోగ్యకరమైన, సరసమైన ధరల్లో ఆహారాన్ని అందుబాటులో ఉంచడం
- ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం కోసం ప్రముఖులతో భాగస్వామ్యం.
- ప్రతిభావంతులైన యువ ప్రొఫెషనల్స్కు ప్రోత్సాహం. ‘సమన్వయ’ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలు, ఐటీఐల మధ్య సహకారాన్ని పెంపొందించడం
- ఐఏఎస్, కేఏఎస్, బ్యాంకింగ్, ప్రభుత్వోద్యోగాలకు శిక్షణ పొందే విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం
- మిషన్ స్వాస్థ్య కర్ణాటక’ పథకం ద్వారా ప్రజారోగ్య మౌలిక సదుపాయాల బలోపేతం
- పురపాలక సంఘాల్లో ప్రతి వార్డులో నమ్మ క్లినిక్ల ఏర్పాటు
- సీనియర్ సిటిజన్లకు ఉచితంగా ప్రతి సంవత్సరం మాస్టర్ హెల్త్ చెక్-అప్స్టేట్ కేపిటల్ రీజియన్’గా రాబోయే తరాల కోసం బెంగళూరు అభివృద్ధి
- ఎలక్ట్రిక్ వాహనాల ప్రీమియర్ హబ్గా కర్ణాటక అభివృద్ధి
- రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, 1,000 స్టార్టప్ కంపెనీలకు మద్దతు, బీఎంటీసీ బస్సులను పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం
- బెంగళూరు శివారులో ‘ఈవీ సిటీ’ నిర్మాణం
- ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, ఏపీఎంసీల ఆధునికీకరణ, డిజిటైజేషన్, మైక్రో కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటు కోసం రూ.30 వేల కోట్లతో కే-అగ్రి ఫండ్ ఏర్పాటు.
- నూతనంగా 5 ఆగ్రో-ఇండస్ట్రీ క్లస్టర్స్ ఏర్పాటు, కొత్తగా మూడు ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటు
- కర్ణాటకను అత్యంత ఆకర్షణీయమైన టూరిస్ట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దేందుకు రూ.1500 కోట్లు కేటాయింపు
- కల్యాణ సర్క్యూట్, బనవాసి సర్క్యూట్, పరశురామ సర్క్యూట్, కావేరీ సర్క్యూట్, గాణగాపుర కారిడార్ల అభివృద్ధి
- ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం విస్తరణ
- బియాండ్ బెంగళూరు’లో 10 లక్షల మాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగాల సృష్టి
- ఇళ్లు లేని నిరుపేదల కోసం 10 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ
- ఒనకే ఒబవ్వ సామాజిక న్యాయ నిధి’ పథకం క్రింద ఎస్సీ, ఎస్టీ మహిళలు ఐదేళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, దానికి అదనంగా మ్యాచింగ్ డిపాజిట్ రూ.10,000 ప్రభుత్వం చేస్తుంది.
Read More: Bhola Shankar Look: ట్యాక్సీ డ్రైవర్ గా చిరంజీవి.. వింటేజ్ లుక్స్ అదుర్స్