Anurag Thakur: చాలా రాష్ట్రాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నాయి!
- By Balu J Published Date - 05:33 PM, Sat - 22 July 23
దేశంలోని చాలా రాష్ట్రాల్లో మహిళలపై దాడులు పెరిగాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆక్షేపించారు. బిహార్ లోని బెగుసరాయ్ లో బాలికపై జరిగిన దాడి గురించి రాష్ట్ర CM నీతీశ్ కుమార్ ఒక్కసారి కూడా స్పందించలేదని ఆరోపించారు. దేశంలో స్త్రీలపై అకృత్యాలు జరిగే రాష్ట్రాల్లో రాజస్థాన్ తొలిస్థానంలో ఉందని కేంద్రమంత్రి అన్నారు. దేశంలో మహిళలపై జరిగే అత్యాచారాల్లో 22శాతం రాజస్థాన్ లో జరుగుతున్నాయని వెల్లడించారు.
గత నాలుగేళ్లలో రాజస్థాన్ లో మహిళలపై లక్షా 9వేల నేరాలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయని ఠాకూర్ తెలిపారు. నేరస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోని CM అశోక్ గహ్లోత్ .. మహిళలపై పెరుగుతున్న నేరాలను ప్రశ్నించినందుకు మంత్రివర్గం నుంచి రాజేంద్ర గూఢను తొలగించారని ధ్వజమెత్తారు. పశ్చిమ బంగాల్ లోని హావ్ డాలో పంచాయతీ ఎన్నికల రోజున 40 మంది TMC గూండాలు మహిళను వివస్త్రను చేశారనీ.. మాల్దాలో ఇద్దరు మహిళలను వివస్త్రలు చేసి దారుణంగా కొట్టారనీ.. సీఎం మమతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Tags
Related News
Benefits Of MPs: దేశంలో ఎంపీలకు విలాసవంతమైన సౌకర్యాలు, అలవెన్సులు
ఎంపీగా గెలిస్తే ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఎంపీలు నెలవారీ జీతం రూ. 1 లక్ష, అలవెన్సులు సహా. వారి పదవీకాలం తర్వాత పెన్షన్ రూ. 50,000.