HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Attack On Delhi Cm Sensational Details Come To Light In Investigation

Rekha Gupta : ఢిల్లీ సీఎం పై దాడి..దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు

దాడికి ముందు సక్రియాకు సహాయం చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను సక్రియాకు స్నేహితుడైన తహసీన్ సయ్యద్. అతనిని రాజ్‌కోట్‌లో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. విచారణలో తేలినదేమిటంటే, తహసీన్ దాడికి ముందు సక్రియాకు డబ్బు పంపాడు.

  • By Latha Suma Published Date - 10:05 AM, Mon - 25 August 25
  • daily-hunt
Attack on Delhi CM.. Sensational details come to light in investigation
Attack on Delhi CM.. Sensational details come to light in investigation

Rekha Gupta : ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఇటీవల జరిగిన దాడి కేసులో విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా అరెస్టైన రాజేశ్ సక్రియా పక్కా పన్నాగంతో దాడికి తెగబడినట్లు తాజా పోలీసు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అతను మొదట్లో ఆమెపై కత్తితో దాడి చేయాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటికీ, భద్రతా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండటంతో చివరికి తన దాడి తీరును మార్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే… ఢిల్లీలో వీధికుక్కల పెరుగుతున్న సంఖ్య, ప్రజలకు వాటి వల్ల ఏర్పడుతున్న సమస్యలపై సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. వీధికుక్కలను నివాస ప్రాంతాల నుంచి షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఇదే అంశంపై సక్రియా గతంలో సీఎం రేఖా గుప్తాను పలుమార్లు కోరినట్లు అతను చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. కానీ సీఎం స్పందించకపోవడంతో ఆగ్రహించిన రాజేశ్, ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేగాక, అతడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి. ముందుగా ఢిల్లీలోని సుప్రీంకోర్టు వద్దకు చేరుకున్నప్పటికీ, అక్కడ భద్రత గట్టి ఉండటంతో వెనక్కి వెళ్లిపోయాడు.

Read Also: AP New Bar Policy : 840 కొత్త బార్లకు 30 అప్లికేషన్లే..మరి ఇంత దారుణమా..?

అనంతరం సీఎం కార్యాలయంలో జరిగే ప్రజా వినతి కార్యక్రమమైన ‘జన్ సున్వాయీ’కు కత్తితో హాజరయ్యాడు. అయితే అక్కడ కూడా భద్రత దృఢంగా ఉండటంతో, తన వద్ద ఉన్న కత్తిని బయటే పడేసి లోపలికి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన అనంతరం రేఖా గుప్తాను ప్రత్యక్షంగా కలిసిన సక్రియా, ఆమెతో వాగ్వాదం చేసాడు. ఆగ్రహంతో ఆమె చెంపపై కొట్టి, తోసేసి, జుట్టు పట్టుకుని లాగాడు. ఈ ఘటన అనంతరం ఆయనను అక్కడే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను పరిశీలించిన పోలీసులకు మరిన్ని కీలక ఆధారాలు లభించాయి. ఈ దర్యాప్తులో మరో కీలక మలుపు తలెత్తింది. దాడికి ముందు సక్రియాకు సహాయం చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను సక్రియాకు స్నేహితుడైన తహసీన్ సయ్యద్. అతనిని రాజ్‌కోట్‌లో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. విచారణలో తేలినదేమిటంటే, తహసీన్ దాడికి ముందు సక్రియాకు డబ్బు పంపాడు. అంతేకాకుండా ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు. అంతటితో ఆగకుండా, సక్రియా సీఎం నివాసాన్ని వీడియోతీసి తహసీన్‌కు పంపినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా, రాజేశ్ సక్రియాపై గుజరాత్‌లో పలు మద్యం అక్రమ రవాణా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసుల సమాచారం. అతడి నేరచరిత్రను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీధికుక్కల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు మరిన్ని కీలక విషయాలను వెలికితీసేందుకు సాంకేతిక ఆధారాలతో కూడిన దర్యాప్తును కొనసాగిస్తున్నారు. సిసిటీవీ ఫుటేజ్, కాల్ రికార్డులు, డిజిటల్ డేటా ఆధారంగా మరింత లోతుగా విచారణ సాగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also:MLC Kavitha : కవితతో మాకు ఎలాంటి సమస్య లేదు – జగదీశ్ రెడ్డి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • attack
  • delhi
  • delhi cm
  • Jan Sunwai
  • Rajesh Sakaria
  • Rekha Gupta
  • street dogs
  • Supreme Court
  • Tahseen Sayyed

Related News

Jacqueline Fernandez

Jacqueline Fernandez: రూ. 200 కోట్ల మోసం కేసు.. స్టార్ హీరోయిన్‌కు సుప్రీంకోర్టులో షాక్‌!

మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్న 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో తనపై జరుగుతున్న విచారణను రద్దు చేయాలని కోరుతూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  • Vijayawada Utsav Sh

    Vijayawada Utsav 2025: ‘విజయవాడ ఉత్సవ్’కు తొలిగిన అడ్డంకి

Latest News

  • Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రభుత్వానికి.. ఎల్‌అండ్‌టీ నుంచి పూర్తిస్థాయి స్వాధీనం

  • Man Ate Spoons: స్పూన్లు, టూత్‌ బ్రష్‌లు మింగిన వ్యక్తి: రిహాబ్‌ సెంటర్‌పై కోపంతో అర్థంలేని పని

  • Parijata: పారిజాత పూల రహస్యం: ఈ పుష్పాలను ఎవరు కోయకూడదో ఎందుకు తెలుసా?

  • SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

  • Car Brands Logo: సుజుకి కొత్త లోగో.. డిజిటల్ యుగంలో ఆటోమొబైల్ బ్రాండ్ల కొత్త వ్యూహం!

Trending News

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    • Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd