Amazon : వచ్చేనెల నుంచి భారత్ లో ఆ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అమెజాన్ ..!!
- By hashtagu Published Date - 10:22 AM, Sun - 27 November 22
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సర్వీసులలో ఒకటైన ఫుడ్ సర్వీసును మూసివేయనుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది కస్టమర్లు ప్రభావితం కానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా ప్రకటించింది. వచ్చేనెల డిసెంబర్ నుంచి భారత్ లో అమెజాన్ ఫుడ్ సర్వీసును నిలివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసు డిసెంబర్ 29 నుంచి పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించింది.
Amazon is shutting down its food delivery business in India.
Wait… it had a food delivery business? 😒
— Anubha Pandey (@in_finiteee) November 26, 2022
కాగా అమెజాన్ ఫుడ్ సర్వీసును 2020లో ప్రారంభించింది. కోవిడ్ సమయంలో ఈ సర్వీస్ ను ప్రవేశపెట్టింది కంపెనీ. దీంతో ఎంతో మంది ప్రయోజనం పొందారు. స్విగ్గీ, జొమాటోలకు పోటీగా కంపెనీ ఈ సర్వీసును ప్రారంభించింది. మొదటిసారిగా బెంగుళూరులో ఈ సర్వీసును ప్రవేశపెట్టారు. ఇతర నగరాలకు కూడా విస్తరించేలా ప్లాన్ చేసింది కంపెనీ. అయితే కంపెనీ తన టార్గెట్ ను రీచ్ అవ్వలేకపోయింది. దీంతో శాశ్వతంగా ఫుడ్ సర్వీసును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి అమెజాన్ ఓ ప్రకటనను విడుదలు చేసింది. అయితే కంపెనీ దశలవారీ ఈ ప్రోగ్రామ్ లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీసు వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారికి అమెజాన్ అండగా నిలుస్తుందని ప్రకటించింది.
Amazon to shut down food-delivery business in India https://t.co/qcr067oea5 pic.twitter.com/qhektnMZlZ
— Reuters Asia (@ReutersAsia) November 25, 2022
Related News
IRCTC With Swiggy: ట్రైన్ లో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సదుపాయం
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ స్విగ్గీ మరియు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒప్పందం కుదుర్చుకున్నాయి.