S-400 Missile System : భారత వాయుసేనలో పవర్ఫుల్ ఆయుధం ఇదే !
S-400 Missile System : భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన తర్వాత భారతదేశం S-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది.
- By Sudheer Published Date - 07:36 AM, Fri - 9 May 25

భారత దేశం (India), తన వైమానిక భద్రతను మరింత బలపర్చుకునే క్రమంలో రష్యా (Russian ) తయారు చేసిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (S-400 Defence System) అయిన S-400 ట్రయంఫ్(S-400 Missile System)ను ఆయుధంగా చేర్చుకుంది. తాజాగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన అనంతరం, ఈ మిస్సైల్ సిస్టమ్ను యాక్టివేట్ చేసిన భారత వాయుసేన, ఏదైనా వైమానిక ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధమైంది. ఇది శత్రు దేశాల నుంచి వచ్చే ఏరేల్ దాడులను తిప్పికొట్టడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
S-400 ట్రయంఫ్ మిస్సైల్ సిస్టమ్ను రష్యా రూపొందించింది. ఇది ఎంతో దూరం నుంచి వచ్చే విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను గుర్తించి తక్షణమే నాశనం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక్కసారిగా 36 టార్గెట్లను ట్రాక్ చేయగలదు మరియు నాలుగు రకాల మిస్సైళ్లను ఉపయోగించి వివిధ దూరాల్లోని లక్ష్యాలను ఛేదించగలదు. దాదాపు 400 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చే ఏదైనా ఎయిర్ థ్రెట్ను ఇది నాశనం చేయగలదు.
Pak PM House: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుడు.. బంకర్లోకి షాబాజ్ ?
భారతదేశానికి రక్షణ వ్యూహాత్మకంగా S-400 చాలా కీలకమైన ఆయుధం. ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనాల వంటి సవాలుతో ఉన్న దేశాల దాడులను అడ్డుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే కొన్ని యూనిట్లు భారతదేశానికి అందించబడ్డాయి. మిగిలినవి కూడా డెలివరీ అవుతున్నాయి. ఈ మిస్సైల్ సిస్టమ్ అందుబాటులో ఉండటం వల్ల భారత వాయుసేనకు సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ చేసుకోవచ్చు.
S-400 ట్రయంఫ్ (S-400 Triumph) మిస్సైల్ సిస్టమ్ను రష్యా యొక్క అల్మజ్-అంటే డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది. ఇది S-300 యొక్క అభివృద్ధి అయిన కొత్త తరం వాయు రక్షణ వ్యవస్థ. 2007లో రష్యా దళాల్లో సేవలోకి వచ్చిన ఈ వ్యవస్థను ప్రస్తుతం రష్యా, చైనా, భారత్, టర్కీ వంటి కొన్ని దేశాలు వినియోగిస్తున్నాయి.
సాంకేతిక లక్షణాలు:
రేడార్ వ్యవస్థ: S-400 వ్యవస్థకు ఆధునిక ఫేజ్ అరే రాడార్లు ఉన్నాయి. ఇవి ఒకేసారి 100 కంటే ఎక్కువ లక్ష్యాలను ట్రాక్ చేసి వాటిలో 36 లక్ష్యాలను అంచనా వేయగలవు.
మిస్సైల్ రేంజ్: ఇది నాలుగు రకాల మిస్సైళ్లను ప్రయోగించగలదు – వీటిలో కొన్ని 40km, 120km, 250km మరియు అత్యధికంగా 400km దూరం వరకు ప్రయోగించవచ్చు.
లక్ష్యాలు: విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు వంటి అనేక రకాల వైమానిక ముప్పులను ఇది ఎదుర్కొనగలదు.
గమనించే లక్షణం: సరిగ్గా మానవరహిత విమానాలపైనా, స్టెల్త్ టెక్నాలజీ కలిగిన యుద్ధ విమానాలపైనా ఇది సమర్థంగా పని చేస్తుంది.
భారతదేశానికి ప్రాధాన్యత :
భారతదేశం 2018లో రష్యాతో సుమారు 5.43 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్కు మొత్తం 5 యూనిట్లు S-400 అందించనున్నారు. ఇప్పటివరకు రెండు యూనిట్లు భారత వాయుసేనకు చేరాయి. ముఖ్యంగా చైనా మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ యూనిట్లను మోహరించడంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇవి భారత గగనసీమను మరింత భద్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఇదే రష్యా నుండి భారత్
కొనుగోలు చేసిన S-400 డిఫెన్స్ సిస్టమ్👌
pic.twitter.com/nvMVmkxqsf— RAM..🇮🇳 (@ram_views) May 8, 2025