14 Year Old Girl Die: చలికి విద్యార్థిని మృతి
గుజరాత్లోని రాజ్కోట్లో చలి కారణంగా ఎనిమిదో తరగతి చదువుతున్న రియా(14) అనే బాలిక మృతి (14 Year Old Girl Die) చెందింది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ పాఠశాల యాజమాన్యం స్వెట్టర్ ధరించేందుకు అనుమతి ఇవ్వలేదని అందువల్లే తమ కూతురు మృతి చెందిందని ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
- By Gopichand Published Date - 07:55 AM, Thu - 19 January 23
గుజరాత్లోని రాజ్కోట్లో చలి కారణంగా ఎనిమిదో తరగతి చదువుతున్న రియా(14) అనే బాలిక మృతి (14 Year Old Girl Die) చెందింది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ పాఠశాల యాజమాన్యం స్వెట్టర్ ధరించేందుకు అనుమతి ఇవ్వలేదని అందువల్లే తమ కూతురు మృతి చెందిందని ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి గుండెపోటు రావడంతోనే బాలిక మృతి చెంది ఉంటుందని, పోస్ట్మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామని వైద్యులు చెబుతున్నారు.
రాజ్కోట్ నగరంలోని గొండాల్ రోడ్లోని అమృత్లాల్ విర్చంద్ జసాని విద్యామందిర్ అనే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న రియా సాగర్ (14) అనే విద్యార్థిని మంగళవారం ఉదయం 7.23 గంటలకు తన తరగతి గదిలోనే కుప్పకూలింది. పాఠశాల ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అంబులెన్స్కు కాల్ చేయడానికి అత్యవసర నంబర్కు డయల్ చేసింది. పాఠశాల వెనుక ఉన్న దేభార్ రోడ్డులో నివసిస్తున్న ఆమె తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకుని బాలికను సమీపంలోని ఛారిటబుల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.
Also Read: Menstrual Leave : దేశంలోనే తొలిసారి కేరళలో సంచలన నిర్ణయం : ఇక మహిళా స్టూడెంట్స్ కు పీరియడ్ లీవ్స్
బుధవారం రియా తల్లి జాంకీ సాగర్ బాలికకు ఎలాంటి అనారోగ్య పరిస్థితి లేదని పేర్కొన్నారు. నా కూతురికి ఎలాంటి అనారోగ్యం లేదు. కానీ ఈ రోజుల్లో వాతావరణం చాలా చల్లగా ఉండడంతో పిల్లలు ఉదయాన్నే బడికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. చలి కారణంగా నా కుమార్తె రక్తం స్తంభించిపోయింది. తత్ఫలితంగా ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆమె గుండెపోటుతో బాధపడలేదు. కానీ ఆమె రక్తం గడ్డకట్టడం వల్ల మరణించిందని జానకి మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజ్కోట్ ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత చలిని చూస్తోంది. నగరంలో గత కొన్ని రోజులుగా ఎనిమిది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Related News
One Voter : ఈ పోలింగ్ బూత్ల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. హ్యాట్సాఫ్ ఈసీ
One Voter : సార్వత్రిక ఎన్నికలకు యావత్ దేశం రెడీ అవుతోంది. ఒకే ఒక్క ఓటరు(One Voter) ఉన్న ఓ కుగ్రామం కూడా ఈ కీలక ఘట్టానికి సమాయత్తం అవుతోంది.