Republic Day Chief Guest: గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?
ఈసారి రిపబ్లిక్ డే పరేడ్కు ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా అల్-సిసి (President Abdel Fattah Al Sisi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు ఆయన జనవరి 24న ఢిల్లీకి వస్తున్నారు. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్-సిసి హాజరు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
- By Gopichand Published Date - 01:46 PM, Sat - 21 January 23
ఈసారి రిపబ్లిక్ డే పరేడ్కు ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా అల్-సిసి (President Abdel Fattah Al Sisi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు ఆయన జనవరి 24న ఢిల్లీకి వస్తున్నారు. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్-సిసి హాజరు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈజిప్ట్ నుంచి ఒక నేత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు జనవరి 24న ఈజిప్ట్ అధ్యక్షుడు ఢిల్లీ చేరుకుంటారు. 25వ తేదీన ప్రధాని మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. సిసితో పాటు ఈజిప్ట్ నుండి 120 మంది సభ్యులతో కూడిన బృందం కూడా పాల్గొంటుంది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి.
Also Read: UK PM Rishi Sunak fined: యూకే ప్రధాని రిషి సునక్ కు జరిమానా
గత సంవత్సరం రాజ్పథ్ పేరును ‘కర్తవ్య మార్గం’గా మార్చిన తర్వాత సెరిమోనియల్ బౌలేవార్డ్లో నిర్వహించబడుతున్న మొదటి గణతంత్ర దినోత్సవ వేడుక ఇదే. దాదాపు 42,000 మంది హాజరవుతారని అంచనా. “మన గణతంత్ర దినోత్సవానికి ప్రెసిడెంట్ సిసిని ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ప్రెసిడెంట్ సిసి ఆహ్వానాన్ని సాదరంగా అంగీకరించారు. ఈ సంవత్సరం G20 ప్రెసిడెన్సీ సమయంలో ఈజిప్ట్ను అతిథి దేశంగా ఆహ్వానించాము” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఔసఫ్ సయీద్ తెలిపారు.
74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 19 దేశాల నుంచి 32 మంది అధికారులు, 166 మంది క్యాడెట్లు పాల్గొననున్నారు. ఈ ఏడాది ప్రజల కోసం ప్రభుత్వం 32,000 టిక్కెట్లను ఆన్లైన్లో విక్రయించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మొదటి సారి వేడుక ఈవెంట్ కోసం అన్ని అధికారిక ఆహ్వానాలు కూడా ఆన్లైన్లో పంపబడుతున్నాయి. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈ వేడుకలు ప్రారంభమై మహాత్మా గాంధీ వర్ధంతి (జనవరి 30) వరకు కొనసాగుతాయి.
Related News
Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..
2024 లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్లకు ప్రధాని మోదీయే ఎక్కువ మద్దతు ఇస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.