100 Flights Delayed: ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. 100 విమానాలు ఆలస్యం
ఢిల్లీలో పొగమంచు నిరంతరం పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకి వెళ్లాలంటే ప్రజలకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ఇప్పుడు ఇది విమానాలపై కూడా ప్రభావం చూపడం ప్రారంభించింది. మంగళవారం (డిసెంబర్ 27) ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA)లో కనీసం 100 విమానాలు (100 Flights) ఆలస్యం అయ్యాయి.
- Author : Gopi
Date : 28-12-2022 - 10:53 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీలో పొగమంచు నిరంతరం పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకి వెళ్లాలంటే ప్రజలకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ఇప్పుడు ఇది విమానాలపై కూడా ప్రభావం చూపడం ప్రారంభించింది. మంగళవారం (డిసెంబర్ 27) ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA)లో కనీసం 100 విమానాలు (100 Flights) ఆలస్యం అయ్యాయి. రెండు విమానాలు మళ్లించబడ్డాయి. దృశ్యమానత 200 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్పైస్జెట్ విమానాన్ని ఉదయం 11:45 గంటలకు, ఇండిగో విమానాన్ని 2:15 గంటలకు జైపూర్కు మళ్లించారు.
దట్టమైన పొగమంచు కారణంగా ఇది మొదటి మళ్లింపు అని అధికారులు చెప్పారు. ఈ సమయంలో దృశ్యమానత కేవలం 50 మీటర్లు మాత్రమే. ఈ నేపథ్యంలో రాజ్కోట్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎస్జీ3756 నంబర్ విమానాన్ని జైపూర్కు మళ్లించారు. దీంతో పాటు దోహా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఫ్లైట్ నంబర్ 6E1774ను కూడా జైపూర్కు మళ్లించారు. విజిబిలిటీ 50 మీటర్లు ఉన్నప్పుడు విమానాలు విమానాశ్రయంలో దిగవచ్చు. రన్వే విజిబిలిటీ రేంజ్ (RVR) 125 మీటర్లు ఉంటే తప్ప విమానాలు బయలుదేరడానికి అనుమతించబడవు. ఇది కొంతమంది రాకపోకలు, నిష్క్రమణలకు దారితీసింది అని ఒక అధికారి తెలిపారు.
Also Read: 94 Special Trains: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లు
విమానాశ్రయంలో తెల్లవారుజామున 3.30 నుండి 7.30 గంటల మధ్య దృశ్యమానత అధ్వాన్నంగా ఉందని, ఇది కేవలం 50 మీటర్ల పరిధిలో మాత్రమే ఉందని అధికారి తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఢిల్లీలో ఒక మోస్తరు నుండి దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉందని, రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో దృశ్యమానత 200 మీటర్ల వరకు పడిపోవచ్చని అంచనాలు చెబుతున్నాయి.