Diabetes: స్వీట్స్ తిన్నాక నీళ్లు తాగితే…షుగర్ వస్తుందా..?
స్వీట్లు అంటే అందరూ ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు...ముఖ్యంగా కొద్దిగా నెయ్యితో చేసిన స్వీట్ భలే రుచిగా ఉంటాయి.
- By hashtagu Published Date - 09:00 AM, Wed - 5 October 22
స్వీట్లు అంటే అందరూ ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు…ముఖ్యంగా కొద్దిగా నెయ్యితో చేసిన స్వీట్ భలే రుచిగా ఉంటాయి. పదిమందిలో ఒకరు మాత్రమే వీటికి దూరంగా ఉంటారు. పండగ సమయంలో వీటిని మరింత తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్లకు దూరంగా ఉండాలి. ఒకవేళ స్వీట్లు తిన్నట్లయితే ఒక్కటి గుర్తుంచుకోండి, పొరపాటున కూడా వెంటనే మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోకండి. ఎందుకంటే స్వీట్లు తిని నీళ్లు తాగితే కొద్ది రోజుల్లో మధుమేహం లక్షణాలన్నీ వచ్చే ప్రమాదం ఎక్కువ
స్వీట్లు తిన్న వెంటనే నీళ్లు తాగకండి!
సాధారణంగా పండుగల సమయంలో స్వీట్లకు ఇప్పుడు గిరాకీ ఎక్కువ! చాలా మంది తమ లాభం కోసం కృత్రిమ పదార్థాలతో, స్వీట్లను తయారు చేస్తుంటారు. కాబట్టి ఇప్పటికే మధుమేహ వ్యాధిగ్రస్తులు అలాంటి స్వీట్లకు వీలైనంత దూరంగా ఉండాలి. స్వీట్లు ఒక్కటే కాదు తీపిపదార్థాలున్న వాటన్నింటికి దూరంగా ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఏదైనా తీపి పదార్థాలు తిన్న వెంటనే నీళ్లు తాగితే రక్తంలో షుగర్ లెవెల్ ఒక్కసారిగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
స్వీట్లు తిన్న వెంటనే నీళ్లు తాగకండి!
ఇది కేవలం షుగర్ వ్యాధి ఉన్నవారికే కాదు డయాబెటిస్ సమస్యలు లేని వారు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. తీపి పదార్థాలు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఆరోగ్యవంతుడైన వ్యక్తికి కూడా మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా పరిశోధనా వర్గాలు తమ నివేదికలో హెచ్చరిస్తున్నాయి!
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆహారం చాలా ముఖ్యం!
మీకు డయాబెటిస్ ఉందని తెలిసిన తర్వాత, మీరు మీ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలు మితంగా తినాలి. మరికొన్ని ఆహార పదార్థాలను పూర్తిగా వదిలేయాలి.
ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీట్లు తినకూడదు. డాక్టర్లు సూచించిన సలహాలు పాటిస్తూ, ఆయన ఇచ్చే మందులను సక్రమంగా తీసుకుంటూ, రెగ్యులర్ డైట్ అలవర్చుకుంటే మధుమేహం సమస్య నుంచి కొంత వరకు బయటపడవచ్చు.
గుర్తుంచుకోండి, మధుమేహం ఉన్నవారు డాక్టర్ సలహాను మించకూడదు!
మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత, సరైన సమయంలో డాక్టర్ ఇచ్చే మందులు తీసుకోవడంతో పాటు కఠినమైన ఆహారాన్ని అనుసరించడం మర్చిపోకూడదు. అలాగే వారి సూచనల మేరకు రక్తంలో చక్కెర స్థాయిని సమయానికి పరీక్షించుకోవాలి.
– కొందరికి పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధి ఉంటుంది. కొన్నిసార్లు, తల్లిదండ్రులకు ఈ వ్యాధి ఉంటే, పిల్లలకు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
– మరికొందరికి మధ్యవయస్సు తర్వాత మధుమేహం వస్తుంది. ఇవన్నీ నేరుగా అనారోగ్యకరమైన ఆహారంతో పాటు చెడు జీవనశైలికి కారణమని చెప్పవచ్చు.
-ఈ సమయంలో వీలైనంత వరకు ఉప్పు , పంచదార ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటూ .. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి. ఉదాహరణకు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
-రాత్రి భోజనానికి అన్నం బదులు చపాతీ తినండి, ప్రొటీన్లు, పీచుపదార్థాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినండి.
Related News
Calcium Carbide: కాల్షియం కార్బైడ్ అంటే ఏమిటి..? దానితో పండిన మామిడి ఆరోగ్యానికి ఎందుకు హానికరం?
మార్కెట్లోకి మామిడికాయల రాక ఎప్పుడో మొదలైంది. అయితే ఈ రోజుల్లో మార్కెట్లో వస్తున్న మామిడిపండ్లు రసాయనాలతో పండినవే.