Health Tips: కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈ డ్రింక్స్ తీసుకుంటే చాలు డయాలసిస్ తో పనేలేదు?
ప్రస్తుతం ప్రతి పదిమందిలో నలుగురు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ ఈ కిడ్నీ వ్యాధి బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెర
- By Nakshatra Published Date - 10:00 PM, Thu - 28 December 23
ప్రస్తుతం ప్రతి పదిమందిలో నలుగురు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ ఈ కిడ్నీ వ్యాధి బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే చాలామంది ఈ కిడ్నీ సమస్యను సరైన సమయంలో గుర్తించకపోవడం వల్ల అది పెరిగి పెద్దదై అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. చాలామంది కిడ్నీ సమస్యలుగా బాధపడుతున్న వారు ఎక్కువగా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే కేవలం మెడిసిన్స్ మాత్రమే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా కూడా వ్యాధులను తగ్గించుకోవచ్చు. అయితే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి డయాలసిస్ అవసరం రాకుండా ఉండాలంటే మూడు రకాల డ్రింక్స్ తాగాల్సిందే అంటున్నారు వైద్యులు.
మరి ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లెమన్ వాటర్.. ఇవి శరీరానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో లెమన్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. పొట్టకి సంబంధించిన సమస్యలకు లెమన్ వాటర్ మంచి ఉపశమనం ఇస్తాయి. ఈ లెమన్ లో ఉండేటటువంటి విటమిన్ సి, శరీరంలో ఆ లోటుని పూర్తిచేస్తాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియాను బయటకు నెట్టేయడంలో లెమన్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తీసుకున్నట్లయితే కిడ్నీలు డి టాక్స్, అవుతాయి. కొబ్బరి నీళ్లు యాలకులు ఈ నీరు వల్ల కలిగే లాభాలు అందరికీ తెలిసినవే, అయితే ఈ నీటికి తోడు యాలకులు అద్భుతమైన ఔషధముగా ఉపయోగపడతాయి.
ఈ కొబ్బరి నీళ్లు నిత్యము త్రాగినట్లయితే శరీరంలో నీటి కొరత కూడా ఉండదు. అటు యాలకులు కారణంగా శరీరంలో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. అదేవిధంగా నోటి దుర్వాసన కూడా పోతుంది. అలాగే కిడ్నీల సంరక్షణ కోసం ఈ కొబ్బరినీళ్లు యాలకులు మిశ్రమం అద్భుతమైన ప్రయోజనాలను కలగజేస్తుంది. కొబ్బరి నీళ్లలో ఈ యాలకుల పొడి కలిపి తీసుకోవడం వలన కిడ్నీలు డి టాక్స్ అవుతాయి. ధనియాలు అల్లం కొంతమంది ఆహారం జీర్ణం అవ్వడానికి గొంతు సమస్యలకు అల్లం ధనియాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండిటి వలన రోగనిరోధక శక్తి వేగముగా పెరుగుతుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి ధనియాలు అల్లం, కలిపిన నీరు అద్భుతమైన ఔషధం. అయితే వాటికోసం ఐదు గ్రాముల ధనియాలు ఐదు గ్రాముల అల్లం తీసుకొని నీటిలో వేసి, బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని చల్లార్చుకొని గోరువెచ్చగా తీసుకోవాలి ఈ విధముగా చేయడం వలన కిడ్నీలు పూర్తిగా క్లీన్ అవుతాయి.
Related News
Breast Cancer: ఈ విషయాలను పాటిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందట..!
మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ చాలా ముఖ్యమైనది.