Health Benefits : పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్ళు తాగవచ్చా.. అయితే ఏం జరుగుతుంది.?
పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయ వల్ల శరీరానికి ఎంతో
- By Nakshatra Published Date - 05:00 PM, Tue - 16 January 24
పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయ వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా వీటివల్ల ఎన్నో రకాల లాభాలు కూడా ఉన్నాయి. అయితే పుచ్చకాయ మనకు ఎక్కువగా వేసవిలో ఎక్కడ చూసినా కూడా లభిస్తూ ఉంటాయి. అందుకే వేసవి కాలంలో పుచ్చకాయను ఎక్కువగా తింటూ ఉంటారు. పుచ్చకాయ తినడం వల్ల విటమిన్స్ మినరల్స్ శరీరానికి అందుతాయి. పుచ్చకాయలో ఉండే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. అదేవిధంగా చర్మాన్ని పొడిబారకుండా హైడ్రేట్ గా ఉండేలా చేస్తుంది.
ఇదిలా ఉంటే పుచ్చకాయ తిన్న వెంటనే మంచి నీళ్లు తాగకూడదు అని అంటూ ఉంటారు. చాలామందికి పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. మరి పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏం జరుగుతుందో, ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుచ్చకాయ 6 శాతం చక్కెర, 92 శాతం నీరు కలిగి ఉంటుంది. అనగా పుచ్చకాయలు ఎక్కువ శాతం నీరు కలిగి ఉంటాయి. అందువల్ల పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల వాటర్ కంటెంట్ పెరిగి వాంతులు విరేచనాలు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అంతే కాకుండా పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కలుగుతుంది.
పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్ళు తాగితే శరీరం బరువెక్కడం తో పాటు జీర్ణక్రియ నెమ్మదిగా ప్రారంభమై చక్కెరను జీర్ణం చేయడానికి ఇబ్బంది కలుగుతుంది. కడుపు నొప్పి సమస్య ఉన్న వారు పుచ్చకాయ తిని వెంటనే నీరు తాగడం వల్ల వికారం కలుగుతుంది. అలాగే పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. అలాగే పుచ్చకాయ నీరు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని కణాల పనితీరు తగ్గుతుంది. ఫలితంగా బలహీనంగా ఉంటారు. పుచ్చకాయను తిన్న తర్వాత నీళ్ళు తాగడం వల్ల బరువెక్కడంతో పాటు జీర్ణక్రియ నెమ్మదిగా ప్రారంభం అవుతుంది. పుచ్చకాయ మూత్రవిసర్జన గుణాలు కలిగి ఉన్న పండు.
Related News
BRS vs CM Revanth: అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది రేవంత్ రెడ్డి: బీఆర్ఎస్ ట్వీట్
కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది…మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది.